ఆంధ్రప్రదేశ్

రిపోర్టర్‌పై దాడి కేసు .. మోహన్ బాబు పిటిషన్‌పై విచారణ వాయిదా

  • విలేకరిపై దాడి ఘటనలో మోహన్‌బాబుపై కేసు నమోదు
  • పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు కొట్టివేతకు పిటిషన్
  • విచారణను జూలై 3వ తేదీకి వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం

ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబుకు సంబంధించిన కేసు విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ మోహన్‌బాబు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉండగా, న్యాయస్థానం తదుపరి విచారణను జూలై 3వ తేదీకి వాయిదా వేసింది. గతంలో రంజిత్ అనే విలేకరిపై దాడి చేశారన్న ఆరోపణలతో మోహన్‌బాబుపై పహాడీషరీఫ్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును కొట్టి వేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసుకు సంబంధించి మోహన్‌బాబుకు ఇదివరకే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Related posts

డాలర్ రాజ్యంలో డేంజర్ బెల్స్…

Drukpadam

వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరో రాష్ట్రమంతా తెలుసు: షర్మిల

Ram Narayana

ఏపీలో ఈ ఏడాది ఇప్పటివరకు 15,462 రోడ్డు ప్రమాదాలు.. 6,433 మంది మృతి

Ram Narayana