క్రైమ్ వార్తలు

నకిలీ నియామక పాత్రలతో మహిళ ఎస్సైగా రెండేళ్లు చలామణి..

ఒక ఉద్యోగం రావడం ఎంత కష్టమో తెలియంది కాదు …అందులో పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం …అదికూడా ఎస్ ఐ గా రావడం … కానీ రాజస్థాన్ రాష్ట్రంలో ఒక మహిళా మాత్రం తనకు ఎస్ ఐ ఉద్యోగం వచ్చిందని ఏకంగా సర్టిఫికేట్స్ తో పోలీస్ అకాడమీకి వచ్చింది …ఆమె పాత్రలను తీసుకున్న అధికారులు ఆమె పేరు నమోదు చేసుకొని రెండు సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చారు …ఆమె అందరిలాగానే దర్జాగా ట్రైనింగ్ తీసుకుంది …ఐపీఎస్ అధికారులతో ఫోటోలు దిగింది …వారితో కలిసి రోజు ఆటలు ఆడింది …చివరకు ఆమెపై అనుమానం రావడంతో రెండు సంవత్సరాల తర్వాత ఆమెను పట్టుకుని ప్రశ్నించారు ..ఆమె సర్టిఫికెట్స్ ను పరిశీలించి నకిలీవని తేల్చారు …కటకటాల్లో నెట్టారు …

రాజస్థాన్ లోని సికర్ జిల్లా లో 28 ఏళ్ల మోనా బుగాలియా (మూలి దేవి) అనే కిలాడి మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈమె నకిలీ ధృవపత్రాలతో ఏకంగా రెండేళ్లు రాజస్థాన్ పోలీస్ అకాడమీ లో ఎస్సైగా చలామణి అయింది..

మోనా అనే మహిళ ఏకంగా పోలీసులనే బురిడీకొట్టించింది. సబ్ ఇన్‌స్పెక్టర్‌ గా సెలక్టైనట్లు నకిలీ పత్రాలు సృష్టించింది. పోలీస్ అకాడమీలో రెండేళ్ల పాటు ట్రైనింగ్‌ పొందింది. ఐపీఎస్‌ అధికారులతో కలిసి ఫొటోలు దిగింది. రీల్స్ చేసింది. ఏడీజీతో టెన్నిస్ ఆడింది. అయినా ఆమె నకిలీ అన్నది ఎవరూ గుర్తించలేదు. చివరకు మిగతా ట్రైనీలు అనుమా నం వ్యక్తం చేయడంతో ఆ మహిళ గుట్టురట్టయ్యింది.

బీజేపీ పాలిత రాజస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. నాగౌర్ జిల్లాలోని నింబా కే బాస్ గ్రామానికి చెందిన మోనా బుగాలియా, 2021లో సబ్ ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్షలో ఉత్తీర్ణత కాలేదు. అయితే ‘మూలి దేవి’ పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించింది.

సబ్ ఇన్‌స్పెక్టర్‌ గా ఎంపికై నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నది. ఎస్‌ఐ నియామకాలకు సంబంధించిన ప్రత్యేక వాట్సాప్ గ్రూప్‌లో ఆమె చేరింది. స్పోర్ట్స్ కోటా ద్వారా ముందు బ్యాచ్‌కు చెందిన అభ్యర్థిగా పరిచయం చేసుకున్నది. రాజస్థాన్ పోలీస్ అకాడమీలోకి ప్రవేశించింది.

కాగా, మోనా బుగాలియా అలియాస్‌ మూలి దేవి రెండేళ్లపాటు రాజస్థాన్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఎస్‌ఐగా శిక్షణ పొందింది. యూనిఫాంలో పరేడ్ గ్రౌండ్స్‌లో కనిపించడం తోపాటు రిహార్సిల్స్‌లో పాల్గొన్నది.పోలీస్‌ అకాడమీలోని నిషేధిత ప్రాంతాల్లో కూడా స్వేచ్ఛగా తిరిగింది. అయినా ఆమె నకిలీ ట్రైనీ ఎస్‌ఐ అన్నది ఎవరూ గుర్తించలేదు

మరోవైపు 2023లో కొంతమంది ట్రైనీ ఎస్‌ఐలు మోనా బుగాలియా గుర్తింపుపై అనుమానం వ్యక్తం చేశారు. సీనియర్‌ పోలీస్‌ అధికారులకు ఆమె గురించి సమాచారం ఇచ్చారు. దీంతో అంతర్గతంగా దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో నకిలీ గుర్తింపుతో పోలీస్ అకాడమీలో ఎస్‌ఐగా ఆమె శిక్షణ పొందుతున్నట్లు బయటపడటంతో కేసు నమోదైంది.

కాగా, 2023 నుంచి పరారీలో ఉన్న మోనాను సికర్ జిల్లాలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమె నివసించిన అద్దె ఇంటిలో తనిఖీలు చేశారు. రూ.7 లక్షల నగదు, మూడు ప్రత్యేక పోలీసు యూనిఫా మ్స్‌, రాజస్థాన్ పోలీస్ అకాడమీకి చెందిన పరీక్షా పత్రాలు, తప్పుడు గుర్తింపు కోసం వినియోగించిన నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లా నివాసి అయిన మూలి దేవి 2021 లో సబ్-ఇన్స్పెక్టర్ నియామక పరీక్షకు హాజరయ్యారు, కానీ ఆమె ఉత్తీర్ణురాలైంది అని పోలీసులు తెలిపారు.

మూలి దేవి సబ్-ఇన్స్పెక్టర్ గా ఎలా నటించగలిగింది?
బుగాలియా ప్రజలకు సమాచారం ఇచ్చి, తాను ఎంపికయ్యానని సోషల్ మీడియాలో షేర్ చేసి, పోలీసు అధికారిగా నటించడం ప్రారంభించింది. సరైన దుస్తులు ధరించి, నిజమైన పోలీసు అధికారులతో పాటు శిక్షణ పొందేందుకు ఆమె రాజస్థాన్ పోలీస్ అకాడమీని కూడా సంప్రదించింది. శిక్షణతో పాటు, ఆమె అధికారులతో ఫోటోలు కూడా తీసుకుంది మరియు అనుమానాన్ని నివారిస్తూ వారి వర్గాలలో ప్రచారం చేయడం ప్రారంభించింది, నివేదిక పేర్కొంది.

రాజస్థాన్ పోలీస్ అకాడమీలో శిక్షణ సమయంలో ఐడి తనిఖీలు నిర్వహించే ప్రధాన ద్వారం నుండి కాకుండా, అధికారులు , వారి కుటుంబాలు ఉపయోగించే ప్రత్యామ్నాయ ద్వారం ద్వారా ఆమె అకాడమీలోకి ప్రవేశించాలని ఎంచుకుందని పోలీసులు వివరించారు.

మూలి దేవి ఎలా పట్టుబడింది?
బుగాలియా దాదాపు రెండు సంవత్సరాలు అబద్ధాలు చెప్పడం కొనసాగించింది, కానీ సబ్-ఇన్‌స్పెక్టర్ల కోసం వాట్సాప్ గ్రూప్‌లో చేరి ఎవరినైనా బెదిరించిన తర్వాత పట్టుబడింది. ఆమె బెదిరించిన వ్యక్తి తరువాత ఉన్నత అధికారులకు సమాచారం అందించాడు, దీని ఫలితంగా మోనా పోలీసు అధికారి కాదని తేలింది.

2023లో జైపూర్‌లోని శాస్త్రి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది, ఆ తర్వాత జైపూర్‌లోని ఆమె అద్దెకు తీసుకున్న నివాసంపై దాడి జరిగింది. దాడి సమయంలో, మోనా పోలీసు అధికారిగా నటించడానికి ఉపయోగించిన అనేక వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు – పోలీసు యూనిఫాం, బెల్ట్, బ్యాడ్జ్ మరియు ఐడి కార్డులు వంటి నకిలీ పత్రాలు. అయితే, మోనా ఇప్పటికే పారిపోయి, రాజస్థాన్‌లోని సికార్‌లోని కోచింగ్ సెంటర్ సమీపంలో అరెస్టు కావడానికి ముందు దాదాపు రెండు సంవత్సరాలుగా పరారీలో ఉంది.

శాస్త్రి నగర్ పోలీస్ స్టేషన్ SHO మహేంద్ర యాదవ్ మాట్లాడుతూ, ఒక ఇన్ఫార్మర్ నుండి సమాచారం అందుకున్న తర్వాత పోలీసులు ఆమె ఆచూకీ గురించి తెలుసుకున్నారని చెప్పారు. అరెస్టు సమయంలో ఆమె విద్యార్థినిగా మారువేషంలో ఉండటానికి ప్రయత్నించింది కానీ పోలీసుల నుండి తప్పించుకోలేకపోయింది.

దాదాపు రెండు సంవత్సరాలుగా మోనా ఇంత విస్తృతమైన స్కామ్‌ను ఎలా నిర్వహించగలిగిందో మరియు ఆమెకు ఎవరు సహాయం చేశారో తెలుసుకోవడానికి పోలీసులు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. ఆమె కాంటాక్ట్‌లు మరియు కాల్ వివరాలను కూడా దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి…!

Ram Narayana

సైబర్ మోసాల్లో వేరే లెవల్.. కోర్ట్ సెట్టింగ్ వేసి సరికొత్త మోసం

Ram Narayana

హైద్రాబాద్ లో అంబులెన్స్ చోరీ …

Ram Narayana