భారత్ లో 'ఎక్స్' వినియోగదారులకు గుడ్ న్యూస్
జనరల్ వార్తలు ...

భారత్ లో ‘ఎక్స్’ వినియోగదారులకు గుడ్ న్యూస్

ప్రపంచ శ్రీమంతుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత దాని పేరును ఎక్స్ గా మార్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు, అప్పటి వరకు ఉచితంగా ఉన్న ట్విట్టర్ బ్లూ టిక్ ఖాతాలకు పెయిడ్ సబ్ స్క్రిప్షన్ ను తీసుకొచ్చారు. ఈ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ తో మన దేశంలో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సబ్ స్క్రిప్షన్ ధరలను భారీగా తగ్గించారు. తాజా నిర్ణయం ప్రకారం… నెలకు రూ. 5,130గా ఉన్న ప్రీమియం ప్లస్ సబ్ స్క్రిప్షన్ ధర రూ. 3 వేలకు అందుబాటులోకి రానుంది. రూ. 900గా ఉన్న ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ధర రూ. 470కి తగ్గనుంది. యాప్ వర్షన్ లో బేసిక్ ప్లాన్ నెలకు రూ. 244గా ఉన్న ధర రూ. 170కి… ప్రీమియం రూ. 650 నుంచి రూ. 427కి… ప్రీమియం ప్లస్ రూ. 3,470 నుంచి రూ. 2,570కి దిగిరానున్నాయి.

Related posts

తెగిపోయిన నాలుగు వేళ్లను తిరిగి అతికించడానికి 12 గంటల పాటు సర్జరీ

Ram Narayana

కోవిద్ మరణాల తప్పుడు లెక్కలతో తలలు పట్టుకుంటున్న రాష్ట్రాలు !

Drukpadam

It’s Always Sunshine in LA

Ram Narayana