ప్రమాదాలు ...

బుగ్గన కుమారుడి వివాహ రిసెప్షన్ చూసుకుని వెళుతుండగా ప్రమాదం… ఆరుగురి పరిస్థితి విషమం

  • డోన్ లో బుగ్గన కుమారుడి వివాహ రిసెప్షన్
  • వేడుకకు హాజరైన జగన్
  • ట్రాలీ ఆటో బోల్తాపడి 30 మందికి గాయాలు

మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ ఈరోజు డోన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి జగన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. జగన్ రాకతో డోన్ జనసంద్రంగా మారింది. పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒక అపశృతి చోటుచేసుకుంది. 

హైవేపై వెల్దుర్తి వద్ద టైరు పేలి ట్రాలీ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెల్దుర్తి ఆసుపత్రికి, కర్నూలు ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు బేతంచర్ల మండలం రుద్రవరంకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదానికి గురైన వారంతా ఈ వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు. వేడుక అనంతరం తిరిగి వెళుతుండగా ప్రమాదం సంభవించింది.

Related posts

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్ ప్రమాదం …ఇద్దరు మృతి పలువురికి గాయాలు

Ram Narayana

సింగరేణి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులో ప్రమాదం.. ఇద్దరు కార్మికుల సజీవ దహనం

Ram Narayana

అమెరికాలో బైక్ ప్రమాదం.. తెలుగు విద్యార్థి దుర్మరణం…

Ram Narayana