తెలంగాణ వార్తలు

అక్టోబర్ 14న తెలంగాణ బంద్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?

అక్టోబర్ 14న తెలంగాణ బంద్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరసనగా 2025, అక్టోబర్ 14న బీసీ సంఘాలు తెలంగాణ బంద్‎కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో బీసీ సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అక్టోబర్ 14న తలపెట్టిన తెలంగాణ బంద్‎ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. 14వ తేదీకి బదులు అక్టోబర్ 18న తెలంగాణ బంద్ నిర్వహిస్తామని వెల్లడించాయి. ఆదివారం (అక్టోబర్ 12) లక్డీకపూల్‎లోని అశోక హోటల్‎లో బీసీ సంఘాలు సమావేశమయ్యాయి.

ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లపై ఐక్యంగా పోరాడటం కోసం బీసీ సంఘాలన్నీ బీసీ జీఏసీగా ఏర్పడ్డాయి. బీసీ జేఏసీ చైర్మన్‎గా రాజ్య సభ ఎంపీ ఆర్. కృష్ణయ్య, వైస్ చైర్మన్‎గా వీజీఆర్ నారగోని, వర్కింగ్ ఛైర్మెన్‎గా జాజుల శ్రీనివాస్ గౌడ్, కో చైర్మన్లుగా దాసు సురేష్, రాజారామ్ యాదవ్‎లు ఎన్నికయ్యారు. ఈ సమావేశంలోనే అక్టోబర్ 14న తలపెట్టిన బీసీ సంఘాల తెలంగాణ బంద్‎ను ఈ నెల 18కి వాయిదా వేయాలని నిర్ణయించారు.

Related posts

కరెంటుపై గ్రామసభలు …డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

Ram Narayana

అనర్హుల పెన్షన్లు తొలగించాలి: సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

హైడ్రా బాధితుల బాధలు విని ఎమోషనల్ అయిన హరీశ్ రావు!

Ram Narayana