జాతీయ రాజకీయ వార్తలు

యోగి ఒక చొరబాటుదారుడు.. ఉత్తరాఖండ్‌కు తిరిగి పంపాలి: అఖిలేశ్ యాదవ్

  • యూపీ సీఎం యోగిపై అఖిలేశ్ సంచలన ఆరోపణలు
  • కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు గట్టి కౌంటర్
  • యోగి సిద్ధాంతపరంగా కూడా బీజేపీ వ్యక్తి కాదన్న అఖిలేశ్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యోగి ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కాదని, ఆయన ఒక చొరబాటుదారుడని ఆరోపించారు. ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన ఆయన్ను తిరిగి అక్కడికే పంపించాలని డిమాండ్ చేశారు.

లక్నోలోని లోహియా పార్కులో రామ్ మనోహర్ లోహియా వర్ధంతి సందర్భంగా అఖిలేశ్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్ని పార్టీలు చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా చూస్తున్నాయంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు.

ఈ సందర్భంగా అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ, “వలసలపై బీజేపీ తప్పుడు లెక్కలు చెబుతోంది. మా ఉత్తరప్రదేశ్‌లో కూడా ఒక చొరబాటుదారుడున్నారు. ఆయనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఆయనది ఉత్తరాఖండ్. మేం ఆయన్ను తిరిగి ఉత్తరాఖండ్‌కు పంపాలనుకుంటున్నాం. మరి బీజేపీలో చొరబాటుదారులు ఉన్నారా లేదా?” అని సూటిగా ప్రశ్నించారు.

అంతటితో ఆగకుండా, యోగి ఆదిత్యనాథ్ కేవలం రాష్ట్రానికి మాత్రమే కాదని, సిద్ధాంతపరంగా కూడా బీజేపీకి చొరబాటుదారుడేనని అఖిలేశ్ ఆరోపించారు. “ఆయన బీజేపీ సభ్యుడు కాదు, వేరే పార్టీ సభ్యుడు. మరి అలాంటి చొరబాటుదారులను ఎప్పుడు తొలగిస్తారు?” అని నిలదీశారు.

Related posts

ప్రశాంత్ కిశోర్ పార్టీపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు…

Ram Narayana

ఎన్డీయే కూటమి నేతల భేటీ… మోదీకి మద్దతుగా చంద్రబాబు, నితీశ్ లేఖలు…

Ram Narayana

ఇందిరా గాంధీ చేసిన పొరపాటు అదే.. ఆపరేషన్ బ్లూస్టార్‌పై చిదంబరం సంచలన వ్యాఖ్యలు!

Ram Narayana