తెలుగు రాష్ట్రాలు

పవన్ కల్యాణ్‌తో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం..

  • మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో భేటీ
  • దాదాపు రెండు గంటల పాటు సమావేశమైన పవన్, రంగనాథ్
  • మర్యాదపూర్వక భేటీ అని పవన్ కల్యాణ్ కార్యాలయం ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో హైడ్రా కమిషనర్ ఏ.వీ. రంగనాథ్ సమావేశమయ్యారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్‌లో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. హైదరాబాద్‌లో చెరువులు, ప్రభుత్వ భూముల రక్షణకు హైడ్రా కృషి చేస్తోన్న విషయం తెలిసిందే. హైడ్రా హైదరాబాద్ నగరంలో కోట్లాది రూపాయల విలువ చేసే భూములను పరిరక్షించింది.

ఈ నేపథ్యంలో వీరి మధ్య రెండు గంటల పాటు సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ నగరంలో హైడ్రా పనితీరు తదితర అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఈ భేటీ మర్యాదపూర్వకంగా జరిగిందని పవన్ కల్యాణ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

Related posts

అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్తత… విద్యార్థి సంఘాల ఆందోళన

Ram Narayana

రేపు సీబీఐ కోర్టుకు హాజరుకానున్న జగన్…

Ram Narayana

మనవడి చేతిలో పారిశ్రామికవేత్త జనార్దనరావు దారుణ హత్య..!

Ram Narayana