జాతీయ వార్తలు

బెంగాల్‌లో కలకలం.. చెరువులో వేలకొద్దీ ఆధార్ కార్డులు…

  • పూర్బస్థలీ ఉత్తర్‌ నియోజకవర్గంలో వెలుగు చూసిన ఘటన
  • ఓటరు జాబితా సవరణ జరుగుతున్న సమయంలో ఈ పరిణామం
  • టీఎంసీ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు
  • దేశ భద్రతను మమతా సర్కార్ తాకట్టు పెడుతోందని విమర్శ
  • చొరబాటుదారులకు బెంగాల్ అడ్డాగా మారిందని ఆరోపణ

పశ్చిమ బెంగాల్‌లో ఓ అనూహ్య ఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపింది. రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) జరుగుతున్న తరుణంలో పూర్బస్థలీ ఉత్తర్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఓ చెరువులో వేల సంఖ్యలో ఆధార్ కార్డులు లభించడం కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.

ఈ పరిణామంపై అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), సీఎం మమతా బెనర్జీ లక్ష్యంగా బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. టీఎంసీ ప్రభుత్వం దేశ అంతర్గత భద్రతను పణంగా పెడుతోందని ఆరోపించింది. చొరబాటుదారులకు పశ్చిమ బెంగాల్ ఒక సురక్షితమైన స్థావరంగా మారిందనడానికి ఈ ఘటనే నిదర్శనమని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఓటరు జాబితా సవరణ జరుగుతుండగా ఇంత పెద్ద మొత్తంలో ఆధార్ కార్డులు బయటపడటం వెనుక పెద్ద కుట్ర ఉందని వారు అనుమానం వ్యక్తం చేశారు.

చెరువులో దొరికిన ఆధార్ కార్డులు ఎవరివి, అవి అక్కడికి ఎలా చేరాయన్న దానిపై సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనతో రాష్ట్రంలో బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తీసుకుంటుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Related posts

రైతుల కోసం కేంద్రాన్ని ప్రశ్నించిన ఉపరాష్ట్రపతి…

Ram Narayana

కరూర్ తొక్కిసలాట ఘటన.. టీవీకే కీలక నేత అరెస్ట్…

Ram Narayana

 కేసుల విచారణపై మద్రాసు హైకోర్టు జడ్జి జస్టిస్ దేవానంద్ కీలక వ్యాఖ్యలు

Ram Narayana