జాతీయ వార్తలు

కారు బాంబు పేలుడు.. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా..

  • కారు బాంబు పేలుడులో 13 మంది మృతి
  • శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా
  • బాధితులకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో బాధిత కుటుంబాలకు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ పేలుడులో 13 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

ఈ మేరకు ముఖ్యమంత్రి మాట్లాడుతూ, శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు. బాధితులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. ఈ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా సంతాపం తెలియజేశారు.

Related posts

భారత్ లోని గ్రామాలకు నేపాల్ టెలికాం సిగ్నల్స్… ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు

Ram Narayana

కులగణన చేయాలని కేంద్రం నిర్ణయం

Ram Narayana

అప్పిస్తే జైలుకే: వడ్డీ వ్యాపారాలను నియంత్రించేందుకు కొత్త చట్టం ‘బులా’

Ram Narayana