తెలంగాణ వార్తలు

రామగుండం థర్మల్ కేంద్రం మూసివేత…

ఐదు దశాబ్దాలుగా తెలంగాణకు సేవలందించిన రామగుండం థర్మల్ స్టేషన్ మూసివేయబడింది.రాష్ట్రంలోని 62.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రామగుండం థర్మల్ స్టేషన్ ను అధికారులు మూసివేశారు.

1971 అక్టోబర్‌లో USAID సహకారంతో స్థాపించిన తొలి థర్మల్ స్టేషన్‌గా రామగుండం థర్మల్ స్టేషన్‌గా చరిత్రలో నిలిచిపోయింది. ఈ ప్లాంట్ మొత్తం 18743.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసిన ఈ ప్లాంట్ జీవితకాలం ముగిసిందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరువు ప్రభావిత జిల్లాల్లోని వ్యవసాయ పంపుసెట్లకు ఈ యూనిట్ నుంచి విద్యుత్ సరఫరా చేసేవారు. నాలుగు దశాబ్దాలకు పైగా నిరంతరాయంగా సేవలు అందించిన ఈ థర్మల్ స్టేషన్ తాజాగా మూతపడటంతో చారిత్రక ఘట్టంగా నిలిచింది.

Related posts

వారికీ అవకాశం… ఎల్ఆర్‌ఎస్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!

Ram Narayana

కేసీఆర్‌కు సిట్ మరోసారి నోటీసులు… ఫామ్‌హౌస్‌లో విచారణ జరపాలన్న

Ram Narayana

తెలంగాణలో కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లు ఖరారు

Ram Narayana