జాతీయ వార్తలు

పెళ్లికి 13 రోజుల ముందు విషాదం.. సుఖోయ్ ప్రమాదంలో మృతి చెందిన పైలట్ ఇంట విషాదం…

  • అస్సాంలో కూలిన సుఖోయ్-30 యుద్ధ విమానం
  • ప్రమాదంలో ఫ్లైట్ లెఫ్టినెంట్ అనుజ్ వశిష్ట్ వీరమరణం
  • ఘటనపై విచారణకు ఆదేశించిన భారత వాయుసేన
  • పెళ్లి పనులతో ఉన్న ఇంట్లో మిన్నంటిన రోదనలు

భారత వైమానిక దళం (ఐఏఎఫ్)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అస్సాంలోని తేజ్‌పూర్ సమీపంలో సుఖోయ్-30 యుద్ధ విమానం కూలిపోయిన ఘటనలో ఫ్లైట్ లెఫ్టినెంట్ అనుజ్ వశిష్ట్ (28) వీరమరణం పొందారు. మరో 13 రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా ఆయన మరణించడంతో కుటుంబంలో, ఆయన స్వస్థలంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

తేజ్‌పూర్ ఎయిర్‌బేస్ నుంచి సాధారణ శిక్షణ కోసం బయలుదేరిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదాన్ని పసిగట్టిన అనుజ్ విమానం నుంచి ఎజెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించినా సమయం సరిపోకపోవడంతో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. అస్సాంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో విమాన శకలాలను అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై భారత వైమానిక దళం ఉన్నత స్థాయి దర్యాప్తునకు (కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ) ఆదేశించింది.

హర్యానాలోని శ్రీరాంనగర్‌కు చెందిన అనుజ్ వివాహం ఈ నెల 20న జరగాల్సి ఉంది. పెళ్లి వేడుకలతో కళకళలాడాల్సిన ఆయన ఇంట్లో ఇప్పుడు తీవ్ర విషాదం నెలకొంది. “నా కొడుకును పెళ్లి బట్టల్లో చూడాలనుకున్నాను. కానీ ఇప్పుడు త్రివర్ణ పతాకంలో చుట్టిన పెట్టెలో చూస్తున్నాను” అంటూ ఆయన తండ్రి పవన్ వశిష్ట్ రోదించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. చిన్నప్పటి నుంచే పైలట్ కావాలన్న లక్ష్యంతో ఎదిగిన అనుజ్ మృతి పట్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం ప్రకటించారు. ఆయన పార్థివదేహాన్ని స్వగ్రామానికి తరలించి, పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Related posts

పాన్‌కార్డు ఉన్నవారికి చివరి హెచ్చరిక.. ఈ ఒక్క పని చేయకపోతే మీ పాన్ రద్దయినట్టే!

Ram Narayana

ఆ పార్టీలతో నాకు సంబంధం లేదు.. నేనైతే అయోధ్య వెళుతున్నా.. తేల్చి చెప్పిన హర్భజన్‌సింగ్

Ram Narayana

గుజరాత్ లో మట్టిపెళ్లలు విరిగిపడి ఏడుగురి మృతి… ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

Ram Narayana