Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నిబంధనలు అతిక్రమిస్తున్న వాహనాలపై ఆర్టీఏ అధికారులు కొరడా…

నిబంధనలు అతిక్రమిస్తున్న వాహనాలపై ఆర్టీఏ అధికారులు కొరడా…
-ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ న‌జ‌ర్‌.
-మంత్రి పువ్వాడ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు.
-ఉల్లంఘ‌న‌ల‌ను అరిక‌ట్టేందుకు రంగంలోకి దిగిన 9 టీంలు.

ఒకపక్క సంక్రాంతి సీజన్ కావడంతో తెలంగాణ‌-ఆంధ్రప్ర‌దేశ్‌ రాష్ట్రాల మధ్య అందినకాడికి దండుకునే పనిలో ఉన్న‌ ప్రైవేట్ ట్రావెల్స్ వాహ‌న‌దారుల వ్య‌వ‌హారానికి చెక్ పెట్టేందుకు ర‌వాణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు.

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు నిబంధనలకు విరుద్ధంగా, సరైన పర్మిట్లు లేకుండా, ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తూ పొరుగు రాష్ట్రాల మధ్య తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ వాహ‌నాలపై న‌జ‌ర్ పెట్టారు.

ఇప్పటికే హైదరాబాద్ శివార్లలో పలుచోట్ల తనిఖీలను చేపట్టారు. అనేక వాహనాలు పర్మిట్లు లేకుండా, సరైన పాత్రలు లేకుండా, నిబంధనలు విరుద్ధంగా ఉన్న వాహనాలను అదుపులోకి తీసుకున్నారు.పండగ సీజన్‌లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులపై ఈ మేరకు ర‌వాణా శాఖ అధికారుల దాడులు కొన‌సాగుతున్నాయి.

మోట‌ర్ వేహిక‌ల్ చ‌ట్టం నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తూ తిప్పుతున్న ప్రైవేట్ వాహ‌నాల అక్ర‌మ ర‌వాణాను అరిక‌ట్టేందుకు ప్రత్యేకంగా 9 టీంలు రంగంలోకి దిగిన‌ట్లు ర‌వాణా శాఖ ఉన్న‌తాధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ట్రావెల్స్ బ‌స్సులు, ప‌ర్మిట్లు లేకుండా న‌డుపుతున్న వాహ‌నాల‌పై దృష్టిసారించి దాడులు నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు.

ప్రధానంగా ప్రయివేటు వాహ‌నాలు స్టేజి క్యారియర్లుగా న‌డ‌ప‌టం, స‌రియైన‌ పత్రాలు లేకపోవడం వంటి విష‌యాల‌పై ఈ దాడులు కొన‌సాగిస్తూ కేసులు న‌మోదు చేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు.
ప్రేవేటు వాహ‌నాల డాక్యుమెంట్లను ప‌క్కాగా చెక్ చేయ‌డం జ‌రుగుతోంద‌ని, అతిక్ర‌మించిన వారిని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఉపేక్షించ‌బోమ‌ని హెచ్చ‌రించారు.

ఇలాంటి వాహ‌నాల‌లో ప్ర‌యాణించ‌డం కూడా శ్రేయ‌స్సుక‌రం కాద‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు.
ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వ‌హ‌కులు నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించ‌డం మంచిది కాద‌ని, మోట‌ర్ వాహ‌నాల చ‌ట్టం లోబ‌డి న‌డుచుకోవాల‌ని అధికారులు కోరారు.

కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలి..మంత్రి శ్రీ పువ్వాడ 

కరోనా మహమ్మారి ప్రబలుతున్న దృష్ట్యా ప్రభుత్వ కోవిడ్ నిబంధనలను పాటించడం ద్వారా కరోనా నియంత్రించవచ్చని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఒమిక్రాన్ పట్ల ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అదే సందర్భంలో అజాగ్రత్త కూడా పనికిరాదన్నారు.

ఆర్టీసి బస్సులు, బస్ స్టాండ్ ల్లో, ఆర్టీఏ కార్యాలయాల్లో తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటించేలా చర్యల చేపట్టాలని అధికారులను మంత్రి అజయ్ కుమార్ ఆదేశించారు. పండుగ నేపథ్యంలో ప్రయాణం చేసే ప్రయాణికులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని తెలిపారు. కార్యాలయాల్లో తమ విధులు నిర్వర్తించే రవాణా శాఖ అధికారులు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. రిజిస్ట్రేషన్ల ఇతర పనులు నిమిత్తం కార్యాలయానికి ప్రజలు రాకుండా అదే విధంగా వారికి ఇబ్బంది కలగకుండా ఆన్లైన్ సేవలను వినియోగించుకోవాలని మంత్రి పువ్వాడ సూచించారు

ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఆన్లైన్ సేవలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడానికి అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ఆర్టీఏ కార్యాలయాల్లో 59 రకాల సేవలు కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. రవాణా శాఖలో 17 రకాల సేవలను కార్యాలయానికి వెళ్లకుండానే పొందే వీలును ప్రభుత్వం కల్పించిందని ఇష్యూ ఆఫ్‌ టెంపరరీ పర్మిట్‌, పునరుద్ధరణకు అనుమతి, కొత్తవి మంజూరు, క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ జారీ, చిరునామా మార్పు, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, లెర్నర్‌ లైసెన్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇతర సేవలు ఈ జాబితాలో ఉన్నందున కరోనా దృష్ట్యా ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు.

 

Related posts

జగన్ లేఖ రాయగానే… 6.40 లక్షల టీకా డోస్ లు ఇచ్చిన కేంద్రం!

Drukpadam

టర్కీ, సిరియాలో భూకంపం.. 640కి పెరిగిన మృతుల సంఖ్య!

Drukpadam

ఢిల్లీ ఎయిమ్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిదో అంతస్తులో చెలరేగిన మంటలు…

Drukpadam

Leave a Comment