Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పంజాబ్ లో కాంగ్రెస్ ఓటమికి సిద్దు ప్రధానభాద్యుడా ?

పంజాబ్ లో కాంగ్రెస్ ఓటమికి సిద్దు ప్రధానభాద్యుడా ?
-సీఎం సీట్ మీద కన్నేసిన సిద్దు …చివరకు అమరేందర్ తో తగాదా
-ఆయన సీఎం కుర్చీ మీద నుంచి దించి వేసిన వైనం
-చన్నీ తోనూ పొసగని సిద్దు

గురువారంతో ముగిసిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు బీజేపీ, ఆప్‌ల‌లో స‌రికొత్త ఉత్సాహాన్ని నింప‌గా.. ఘోర ప‌రాజ‌యం పాలైన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ను మ‌రింత నిరాశ‌లో ముంచేశాయి. గ్రూపు త‌గాదాల‌కు పుట్టిల్లుగా మారిన కాంగ్రెస్‌కు ఆ ముఠా క‌క్ష‌లే శ‌నిలా ప‌రిణ‌మించాయ‌ని చెప్ప‌క త‌ప్పుదు. ఇందుకు పంజాబ్ ఎన్నిక‌ల ఫ‌లితాలే సాక్ష్య‌మ‌న్న వాదన‌లూ వినిపిస్తున్నాయి. ఈ మాట నిజ‌మేన‌న్న‌ట్లుగా పంజాబ్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు సంబంధించి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతున్నాయి.

చాలా కాలం క్రిత‌మే సిద్దూ కాంగ్రెస్‌లో చేరిపోయారు. వివాదాల సిద్దుగా పేరుతెచ్చుకున్నారు .నిలకడలేని తనం , అలగటం , పార్టీ నిర్ణయాలను లక్ష్య పెట్టకపోవడం లాంటి చర్యలు పార్టీకి డేమేజ్ చేశాయి. అందువల్ల పంజాబ్ లో కాంగ్రెస్ పరిస్థితి దిగజారడానికి సిద్ధునే ప్రధాన భాద్యుడు అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

అయితే ఎన్నిక‌ల‌కు కొన్నినెలల ముందుగా ఆయ‌న‌కు ఏకంగా పీసీసీ చీఫ్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టిన అధిష్ఠానం తీరును నిర‌సిస్తూ అప్ప‌టిదాకా సీఎంగా కొన‌సాగిన కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీని అధిష్ఠానం సీఎంగా కూర్చోబెట్టింది. మొత్తంగా స‌రిగ్గా ఎన్నిక‌ల ముందు పంజాబ్ కాంగ్రెస్‌లో గ‌తంలో ఎన్న‌డూ లేనంత మేర అల‌జ‌డి రేగింది. సీఎం కుర్చీ ఎక్కుదామ‌ని భావించిన సిద్దూను అమ‌రీంద‌ర్ అడ్డుకున్నారు. చ‌న్నీని కూడా త‌న కంట్రోల్‌లోకి తీసుకోవాల‌ని య‌త్నించిన సిద్దూ విఫ‌ల‌మ‌య్యారు.

ఈ కుమ్ములాట‌ల ఫ‌లితంగానే అటు అమ‌రీంద‌ర్‌, చ‌న్నీతో పాటు ఇటు సిద్దూ కూడా ఓట‌మిపాల‌య్యారు. ఈ త‌ర‌హా ప‌రిస్థితిపై గురువింద సామెత గుర్తుకు తెచ్చేవిధంగా తాజాగా స్పందించిన సిద్దూ.. త‌న కోసం గోతులు తవ్విన వారు.. వారు తీసిన గోతుల్లోనే ప‌ది అడుగుల లోతులో ప‌డిపోయారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పార్టీకి ఘోర ప‌రాభ‌వం ద‌క్కిన స‌మ‌యంలో ఇంకా కుమ్ములాట‌ల గురించే మాట్లాడ‌టం భావ్య‌మా?అంటూ పార్టీ శ్రేణులు సిద్దూ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.కాంగ్రెస్ ను డేమేజ్ చేయడంలో ఆయన నోటిదుల కారణమనే విమర్శలు ఉన్నాయి . సొంత పార్టీ పెట్టుకున్న అమరేందర్ ప్రజాస్వామ్యం గెలిచిందని తాను ఓడిపోయినా కాంగ్రెస్ ఓడిందని సంబరపడ్డాడు ….

Related posts

కాంగ్రెస్ లో కొత్త ట్విస్ట్ ….అధ్యక్ష బరిలో మల్లిఖార్జున ఖర్గే …

Drukpadam

ఉచిత పథకాలు, పార్టీ ఫిరాయింపులపై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు

Ram Narayana

పొంగులేటి ఆధ్వరంలో కలక్టరేట్ కు రైతు భరోసా యాత్ర ఉద్రిక్తత…

Drukpadam

Leave a Comment