Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సాయి గణేష్ ప్రాణం తీసిన పాపం బిజెపి నాయకులదే.. టీఆర్ యస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు!

సాయి గణేష్ ప్రాణం తీసిన పాపం బిజెపి నాయకులదే.. టీఆర్ యస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు!
-మాయమాటలతో సాయి గణేష్ ను బలిపశువును చేశారు.
-టిఆర్ఎస్ పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తే సహించే ప్రసక్తే లేదు..

సాయి గణేష్ ప్రాణం తీసిన పాపం బీజేపీ నాయకులదేనని టీఆర్ యస్ జిల్లా అధ్యక్షుడు , ఎమ్మెల్సీ తాతా మధు బీజేపీ నాయకుల విధానాలపై తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు . ఖమ్మం అభివ్రిద్దిని అడ్డుకోవడంతో పాటు ప్రశాంతంగా ఉన్న ఖమ్మం ను అల్లర్లు రేపి లబ్ది పొందాలని బీజేపీ పగటి కలలు కంటుందని విమర్శించారు. బీజేపీ రెచ్చగొట్టే చర్యలను , మతోన్మాద విధానాలు , చైతన్యవంతమైన ఖమ్మం జిల్లా ప్రజల ముందు చెల్లవని హెచ్చరించారు .

ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడని హితవు పలికారు . లేకపోతె బీజేపీ వారికీ ఖమ్మం ప్రజలు తగిన బుద్ది చెప్పటం ఖాయమని అన్నారు .

సాయి గణేష్ ను పోలీస్ స్టేషన్ ముందు పురుగుల మందు తాగితే హీరో అవుతావ్ అంటూ ప్రోత్సహించింది నిజం కదా ? అని బీజేపీ నేతలను మధు సూటిగా ప్రశ్నించారు . అందువల్ల సంఘటపై పూర్తీ విచారణ జరిపించి భాద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .

టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నందు మీడియా సమావేశం లో బిజెపి పార్టీ కార్యకర్త సాయిగణేష్ మృతిపట్ల తప్పుడు ప్రచారాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నం చేస్తున్న బిజెపి నాయకులపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగిన శ్రీ తాత మధుసూదన్ . యువ నేత కేటీఆర్ జిల్లా పర్యటన చేయనున్న నేపథ్యంలో బిజెపి పార్టీ నాయకులు ఆడిన నాటకంలో యువకుడు సాయి గణేష్ బలి పశువు అయ్యాడని వారు తెలిపారు. శవరాజకీయాలు చేసి ప్రశాంతంగా ఉన్న ఖమ్మం జిల్లా ప్రజలను భయాందోళనకు గురి అయ్యే విధంగా ప్రయత్నం చేయడం బిజెపి పార్టీ నాయకులు పన్నిన పన్నాగంమని ఫైర్ అయ్యారు .
జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ని ధ్వంసం చేయడం, ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేయడం వారి అరాచక సంస్కృతికి నిదర్శనం . రాజకీయ చైతన్యం కలిగిన ఖమ్మం జిల్లా లో బిజెపి ఆటలు సాగవని హెచ్చరించారు. బిజెపి నాయకులు రాజకీయ లబ్ధి కోసంమే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పైచేస్తున్న తప్పుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం మేయర్ పూనుకొల్లు నీరజ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, విత్తనాభివృద్ధి చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,జిల్లా రైతు సమన్వయ కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు , నగర టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పడాల నాగరాజు, ఖమ్మం రూరల్ పార్టీ అధ్యక్షులు బెల్లం వేణు, కార్పొరేటర్ మురళి మరియు టిఆర్ఎస్ నాయకులు మందడపు మనోహర్, రావూరి సైదా బాబు, కోటేశ్వరరావు, ముత్యాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పంజాబ్​ సమస్య తీరింది.. ఇక, రాజస్థాన్​ లో దిద్దుబాటు!..

Drukpadam

దేశరాజధాని ఢిల్లీలో బీఆర్ యస్ హడావుడి …

Drukpadam

అర్ధరాత్రి టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్.. అక్రమ అరెస్టులంటూ చంద్రబాబు మండిపాటు!

Drukpadam

Leave a Comment