Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్ కు ఎంపీ నామ ఘ‌న‌స్వాగతం

ఢిల్లీ లో కేసీఆర్ కు నామా స్వాగతం

జాతీయ స్థాయిలో పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బ‌య‌లుదేరిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న సందర్భంగా అక్కడ విమానాశ్రయంలో టిఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత, ఖ‌మ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆయ‌న నేతృత్వంలో టీఆర్.ఎస్ ఎంపీలు సీఎంకు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, ఆర్థిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశం కానున్నారు. దేశం కోసం వీర మరణం పొందిన సైనిక కుటుంబాలను ఆదుకోనున్నారు. వ్యవసాయం రైతుల హక్కుల కోసం పోరాడి కేంద్రాన్ని నిగ్గదీసి సంచలనం సృష్టించిన జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలను కలిసి సీఎం పరామర్శించనున్నారు.

Related posts

అహ్మదాబాద్ పేలుళ్లకేసులో సంచలన తీర్పు …38 మందికి మరణ శిక్ష!

Drukpadam

ఓటర్ ఐడీని ఆధార్ తో లింక్ ఇలా చేస్తే సరి..!

Drukpadam

మంచినీళ్లు తాగుతున్నా రక్తమే కనిపిస్తోంది: ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది..!

Drukpadam

Leave a Comment