Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ గా ఈటల ….?

బీజేపీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ గా ఈటల ….?
-అమిత్​ షాతో ఈటల భేటీ..
-రాజేందర్ కు కీలక పదవి ఇస్తారని ప్రచారం
-ఈటలకు పార్టీలో తగిన ప్రాధాన్యం లేదని విమర్శలు
-వాటికి చెక్ పెట్టేందుకు ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు ఇస్తారని వార్తలు

మాజీ మంత్రి బీజేపీ కి చెందిన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు పార్టీలో తగిన ప్రాధాన్యత లేదనే విమర్శలు ఉన్నాయి. ఈటల కూడా బీజేపీ కార్యక్రమాలలో పాల్గొంటున్నప్పటికీ పెద్దగా ప్రాధాన్యత లభించటంలేదని ఆయన అనుయాయులు అంటున్నమాట …ఆయనకూడా బీజేపీ లో సంతృప్తిగా లేడని ప్రచారం జరుగుతుంది. దీన్ని పసిగట్టిన అధిష్టానం ఆయనతో మాట్లేడేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా అమిత్ షా తో భేటీకి ఢిల్లీ రావాల్సిందిగా ఆయనకు కబురు పెట్టింది. దీంతో హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన అమిత్ షా తో భేటీ అయ్యారు . ఆయనతో మాట్లాడిన ఈటలకు పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ భాద్యతలు అప్పగించే అవకాశం ఉందని బీజేపీ జాతీయ సమావేశాలు ప్రారంభానికి ముందే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.

తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దూకుడు పెంచింది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. గత నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చి కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించడం… ఇటీవలే తెలంగాణకు చెందిన బీజేపీ నేత లక్ష్మణ్ ను యూపీ నుంచి రాజ్యసభకు పంపించడం.. వచ్చే నెలలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హైదరాబాద్ ను వేదికగా ఎంచుకోవడం చూస్తుంటే టీఆర్ఎస్ ను బీజేపీ టార్గెట్ చేసిందనిపిస్తోంది.

తాజాగా మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆదివారం రాత్రి ఢిల్లీలో షాను కలిసిన ఈటల.. రాష్ట్రంలో కేసీఆర్ అరాచక పాలన గురించి చర్చించామన్నారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం గురించి కూడా షాతో మాట్లాడినట్టు తెలిపారు. ఈటల ఉన్నట్టుండి షాతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

టీఆర్ఎస్ కు రాజీనామా చేసి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన రాజేందర్ కు ఉద్యమకారుడిగా, బలమైన బీసీ నేతగా మంచి పేరుంది. కానీ, రాజేందర్ ను రాష్ట్ర బీజేపీ సరిగ్గా ఉపయోగించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత తనను పక్కనబెట్టారని దాంతో రాష్ట్ర నాయకత్వంపై ఈటల అసంతృప్తితో ఉన్నారన్న చర్చ నడుస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న షా.. ఈటలను ఢిల్లీ రప్పించుకొని ప్రత్యేకంగా సమావేశమయ్యారని సమాచారం. దాదాపు 30 నిమిషాల పాటు ఈ భేటీ జరిగిందని తెలుస్తోంది. రాజేందర్ కు కీలక బాధ్యతలు అప్పగించాలని బీజేపీ ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారని, అందులో భాగంగానే షా నుంచి ఈటలకు పిలుపు వచ్చిందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈటలకు బీజేపీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టే అవకాశం ఉందని అంటున్నారు.

ఈటలకు పదవి ఇస్తే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను బీజేపీలో పట్టించుకోవడం లేదన్న విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు బీసీ నేతలకు తగిన ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది. దాంతో, పార్టీలోకి మళ్లీ వలసలు ఊపందుకుంటాయని అంచనా వేస్తున్నారు.

Related posts

విద్యార్థి సంఘం నేత వెంకట్ కు హుజూరాబాద్ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్!

Drukpadam

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మోడీనే ప్రధాని …ఇండియాటుడే-సీ ఓటర్ సర్వే!

Drukpadam

ఢిల్లీలో ముగిసిన మౌనదీక్ష.. కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్!

Drukpadam

Leave a Comment