Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

“బీఆర్ యస్” గా మారిన టీఆర్ యస్ .. ఇసి గుర్తింపు కేసీఆర్ కు లేఖ!

“బీఆర్ యస్” గా మారిన టీఆర్ యస్ .. ఇసి గుర్తింపు కేసీఆర్ కు లేఖ!
-గురువారం మధ్యాహ్నం 1 .20 గంటలకు ఆవిర్భావం
-తెలంగాణ భవనంలో బీఆర్ యస్ జెండా ఆవిష్కరించనున్న కేసీఆర్
-బీఆర్ యస్ పై పెరుగుతున్న ఆసక్తి

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును..” భారత్ రాష్ట్ర సమితి ” గా ఆమోదిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత సీఎం కెసిఆర్ గారికి అధికారికంగా లేఖ అందింది.

ఈ నేపథ్యంలో .. డిసెంబర్ 9 శుక్రవారం మధ్యాహ్నం 1: 20 నిమిషాలకు దివ్య ముహూర్త సమయాన “భారత రాష్ట్ర సమితి” ఆవిర్భావం కార్యక్రమం నిర్వహించాలని, అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని, బిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో రేపు ఒంటిగంట 20 నిమిషాలకు, తనకు అందిన అధికారిక లేఖకు రిప్లై గా సంతకం చేసి ఎన్నికల సంఘానికి అధికారికంగా పంపించడం జరుగుతుంది.

అనంతరం సీఎం కేసిఆర్ బిఆర్ఎస్ జండాను ఆవిష్కరిస్తారు. పతావిష్కరణ కార్యక్రమం ఉంటుంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హాజరుకావాలని ముఖ్యమంత్రి కోరారు.

వీరితోపాటు.. జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డిసిసిబి అధ్యక్షులు డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ శుక్రవారం మధ్యాహ్నం లోపు తెలంగాణ భవనకు చేరుకోవాలని పార్టీ అధినేత సీఎం కేసిఆర్ తెలిపారు.

Related posts

మోదీతో భేటీ అయిన మమతా బెనర్జీ!

Drukpadam

వైసీపీకి షాక్ …. లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన ఆనం రాంనారాయణ రెడ్డి కూతురు కైవల్యా!

Drukpadam

రాజకీయాల్లో మార్పుకోసం పీకే పాదయాత్ర …జనం లేక వెలవెల …

Drukpadam

Leave a Comment