Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మంత్రి మల్లారెడ్డిపై సొంతపార్టీ ఎమ్మెల్యేల నిరసన గళం …!

మంత్రి మల్లారెడ్డిపై సొంతపార్టీ ఎమ్మెల్యేల నిరసన గళం …!
-ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ
-మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి నివాసంలో సమావేశమైన శాసన సభ్యులు
-హాజరైన కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు
-వీరి అనూహ్య భేటీపై తెరపైకి అనేక ఊహాగానాలు
-వచ్చే ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీకి మైనంపల్లి మంతనాలు
-తనకుమారుడు రోహిత్ కి ఎమ్మెల్యే టికెట్ కోసం ఎత్తులు అంటూ వార్తలు ..

మంత్రి మల్లారెడ్డి పై సొంతపార్టీ ఎమ్మెల్యేలు నిరసన గళం వినిపిస్తున్నారు .మేడ్చల్ జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నివాసంలో సమావేశమై మల్లారెడ్డి ఒంటెత్తు పోకడలపై చర్చించారు .మంత్రి మల్లారెడ్డి తన నియోజకవర్గం వారికే పదవులు ఇప్పించడంపై ఆగ్రహం ప్రకటించారు . తన అభిప్రాయాలను కేటీఆర్ కు కలిసి చెప్పాలని నిర్ణయించుకున్నామని అన్నారు . సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ మా సమావేశంలో రహస్యం ఏమిలేదని తమకు జరుగుతున్నా అన్యాయాల గురించి చర్చించామని ఇంటిని కేటీఆర్ దృష్టికి తీసుకొనిపోయి ఆయన చెప్పినట్లు నడుచుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు .

మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్కాజ్‌గిరి శాసన సభ్యుడు మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో భేటీ అవడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు (కూకట్‌పల్లి), కేపీ వివేకానంద (కుత్బుల్లాపూర్‌), భేతి సుభాష్ రెడ్డి (ఉప్పల్‌), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి) ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ కొంపల్లిలోని మైనంపల్లి నివాసంలో వీరు మంతనాలు సాగించారు. ఉదయం నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు ఒక్కచోటుకు చేరడంపై ఉత్కంఠ మొదలైంది. దాదాపు నాలుగైదు గంటల పాటు వీరంతా భేటీ అయ్యాయి. అల్పాహారం కోసం ఎమ్మెల్యేలను తన ఇంటికి ఆహ్వానించినట్టు మైనంపల్లి చెప్పినా.. తమ జిల్లాల పరిధిలోని ప్రస్తుత రాజకీయాలపై చర్చ జరిగినట్టు సమాచారం.

ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి తీరుపై అసంతృప్తిగా ఉన్న సదరు ఎమ్యెల్యేలు రాబోయే ఎన్నికల నేపథ్యంలో కార్యచరణ కోసమే సమావేశం అయినట్టు తెలుస్తోంది. తమ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని, పదవులన్నీ ఒకే నియోజకవర్గానికి, మంత్రి అనుచరులకే ఇప్పించుకుంటున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు ఆరోపించారు. ఇక, ఇది రహస్య మీటింగ్‌ కాదని, కుటుంబంలాంటి పార్టీలో ఎన్నో ఉంటాయని ఎమ్మెల్యే వివేకానంద వ్యాఖ్యానించారు. అలాగే, వచ్చే ఎన్నికల్లో మైనంపల్లి మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేయాలని, ఎమ్మెల్యే అభ్యర్థిగా తన కుమారుడు రోహిత్ ను నిలబెట్టాలని భావిస్తున్నారని ఇదే విషయాన్ని తాజా భేటీలో తోటి ఎమ్మెల్యేలతో చర్చించారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Related posts

టీపీసీసీ రేసు నుంచి తప్పుకున్న రేవంత్

Drukpadam

బీజేపీ, టీడీపీలకు అమ్ముడుపోయే ఖర్మ నాకు లేదు: పవన్ కల్యాణ్..!

Drukpadam

ప్రతి ఒక్కరినీ కాపాడడం ప్రభుత్వానికి సాధ్యం కాదు: హర్యానా సీఎం

Ram Narayana

Leave a Comment