Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పొంగులేటిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన సీఎల్పీ నేత భట్టి!

పొంగులేటిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన సీఎల్పీ నేత భట్టి!
-దేశానికి దశదిశ లేని సభ బీఆర్ యస్ ఖమ్మం సభ
-బీజేపీ నుంచి దేశానికి పొంచి ఉన్నా సవాళ్ళను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ కే ఉంది .
-ఈనెల 26 నుంచి 2 నెలలు హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర

తెలంగాణ సీఎం కేసీఆర్, మిగత రాష్ట్రాల సీఎంలను తీసుకొచ్చి ఖమ్మంలో  నిర్వహించిన సభ దేశానికి దశ, దిశ ఎజెండా ఇస్తామని ప్రచార ఆర్భాటం చేశారు. కానీ ఆలాంటి ఎజెండానే కన్పించలేదని భట్టి దొప్పిపొడిచారు . గురువారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడుతూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తామంటే సంతోషంగా ఆహ్వానిస్తామని అన్నారు 

దేశ సంస్కృతిని, సంపదని స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి తయారు చేసుకున్న సంస్థలు, వ్యవస్థలను దహించి వేస్తున్న బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎజెండా ఇస్తామని ప్రచారం ఆర్భాటం చేసిన సభలో ఆలాంటి అంశాలు కనిపించకపోవడం బాధాకరమని అన్నారు .

బిఆర్ఎస్ సభ వల్ల దేశానికి, ఖమ్మం ఉమ్మడి జిల్లాకు పనికొచ్చే ఎజెండా కన్పించలేదు. ప్రజలు ఆశీంచిన అంశాల ప్రకటన లేకపోవడం విచారకరమని భట్టి అన్నారు .

ఖమ్మం ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలో గిరిజనలు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్య పరిష్కారం గురించి బిఆర్ఎస్ సభలో ప్రస్తావవించక పోవడం శోచనీయమని పేర్కొన్నారు .

విభజన చట్టం హక్కుగా పొందిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి పోరాటం చేయాలని కోరాము. దీని గురించి మాట్లాడనే లేదు. సింగరేణి బొగ్గు గనులను ప్రయివేటీకరణ చేస్తున్న బిజెపి చర్యలకు ఏలా అడ్డుకట్ట వేస్తారో సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వవకపోవడాన్ని భట్టి తప్పుపట్టారు .

రాష్ట్ర ప్రజలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న ఆనేక సమస్యల గురించి కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు . వాటిని పరిగణలోకి తీసుకొని ప్రకటించాలని సీఎంను డిమాండ్ చేశారు .

దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చినప్పటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ హాయంలో ఏర్పాటు చేసిన సంస్థలు, వ్యవస్థలు, ప్రణాళికలు,  ప్రజాస్వామ్య బలోపేతానికి వేసిన పునాదులు , మిశ్రమ ఆర్ధిక విధానాలు తీసుకొచ్చి దేశం పురోగమనం సాధించేందుకు కాంగ్రెస్ చేసిన కృషినే కారణమని అన్నారు .

ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ఆనేక సంస్థలకు అధిపతులై దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తున్నారంటే దేశంలో కంప్యూటర్ రెవల్యూషన్ తీసుకొచ్చిన స్వర్గీయ ప్రధాని రాజీవిగాంధి గొప్పతనమేనన్నారు .

ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి హరిత విప్లవం, పాడిని అభివృద్ధి చేసి శ్వేత విప్లవం, నీలి విప్లవంతో పాటు బ్యాంకుల జాతీయకరణ, భూసంస్కరణల అమలు, గరిబీ హఠావో నినాదం, ప్రభుత్వ విద్య సంస్థల్లో చదువుకున్న పేదలకు, సామాన్యులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు .

పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా, సర్వీసు ఇతర రంగాల్లో భారత్ అగ్రగామిగా నిలబడటానికి కాంగ్రెస్ తీసుకొచ్చిన అభివృద్ది పథకాల వల్లనే సాధ్యమైందన్నారు .

జాతులు, కులాలు, ప్రాంతాలు, మతాల పేరిట దేశ ప్రజలను విభజించి, విద్వేషాలను రెచ్చగొట్టి, ఘర్షణలు సృష్టించి, రక్తపాతంతో రాజాకీయలబ్ధి పొందాలని చూస్తున్న బిజెపి నేడు దేశానికి పెనుసవాల్ గా మారిందని భట్టి ఆందోళన వ్యక్తం చేశారు .

ఈ నెల 30న రాహుల్ గాంధి చేపడుతున్న భారత్ జోడో యాత్ర శ్రీనగర్ ముగుస్తున్నందన పెద్ద సభ నిర్వహిస్తున్నారు.యాత్రకు కొనసాగింపుగా ఈ నెల 26 నుంచి రెండు నెలల పాటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర మొదలవుతుందన్నారు .బ్లాక్ నుంచి నియోజకవర్గ స్థాయి వరకు రెండు నెలల పాటు నిర్వహించే హాత్ సే హాత్ జోడో యాత్రలో ఇంటింటికి వెళ్లి రాహుల్ గాంధి సందేశాన్ని వినిపిస్తామన్నారు

వామపక్షాలు కాంగ్రెస్ తో కలిసి ప్రయాణం చేస్తే మంచిది …

కాంగ్రెస్ ఆలోచనలు, భావా జాలాన్ని ప్రచారం చేసి హాత్ సే హాత్ జోడో యాత్రలో ప్రజలను భాగస్వాములను చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు కదంతొక్కాలని భట్టి పిలుపు నిచ్చారు .  దేశ ప్రయోజనాల దృష్టా కాంగ్రెస్ తోనే వామపక్షాలు కలిసి ప్రయాణం చేస్తే బావుంటుందని విజ్ఞప్తి. ఇది నా అభిప్రాయం మాత్రమేనని చెప్పారు .

పొంగులేటిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన భట్టి …

మాజీ ఎంపీ బీఆర్ యస్ కు దూరంగా ఉంటున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని కాంగ్రెస్ లోకి రావాలని మీడియా సాక్షిగా ఆహ్వానిస్తున్నానని భట్టి తెలిపారు . కాంగ్రెస్ లోకి రాకుండ నేను అడ్డుపడుతున్నానని అనే విషయాన్నీ విలేకరులు ప్రస్తావించగా అందులో వాస్తవం లేదని కొట్టి పారేశారు . కాంగ్రెస్ పార్టీని జిల్లాలో బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు .

జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్,టి పి సి సి ఉపాద్యక్షులు ,మాజీ శాసన మండలి సభ్యులు పోట్ల నాగేశ్వరరావు,పాలేరు నియోజకవర్గ పి సి సి సభ్యులు రాయల నాగేశ్వరరావు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు పులిపాటి వెంకయ్య,ఖమ్మం నియోజకవర్గ పి సి సి సభ్యులు పుచ్చకాయల వీరభద్రం,వైరా నియోజకవర్గ పి సి సి సభ్యులు మాళోత్ రాందాస్ నాయక్,జిల్లా కాంగ్రెస్ నాయకులు సయ్యద్ హుస్సేన్,నగర బి సి అద్యక్షులు బాణాల లక్ష్మణ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Related posts

ఈటల బాటలో కొండా విశ్వేశ్వర రెడ్డి …బీజేపీ లో చేరేందుకు రంగం సిద్ధం…

Drukpadam

కవిత, బండి సంజయ్.. ఆప్యాయ పలకరింపులు…

Drukpadam

బెంగాల్‌లో హింస.. నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ…

Drukpadam

Leave a Comment