Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాహుల్ గాంధీని ఆదిశంకరాచార్యులతో పోల్చిన ఫరూక్ అబ్దుల్లా!

రాహుల్ గాంధీని ఆదిశంకరాచార్యులతో పోల్చిన ఫరూక్ అబ్దుల్లా!

  • కశ్మీర్ చేరుకున్న రాహుల్ భారత్ జోడో యాత్ర
  • ఆదిశంకరాచార్యుల తర్వాత ఆ ఘనత సాధించింది రాహులేనన్న ఫరూక్ అబ్దుల్లా
  • రాహుల్ యాత్రను వ్యతిరేకించేవారు మానవాళికి శత్రువులన్న ఎన్సీపీ చీఫ్
  • మండిపడుతున్న బీజేపీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఎన్సీపీ చీఫ్, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా.. ఆదిశంకరాచార్యులతో పోల్చారు. జమ్మూకశ్మీర్‌లోని లఖన్‌పూర్‌లో ఈ నెల 10న జరిగిన బహిరంగ సభలో ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన మొదటి వ్యక్తి ఆదిశంకరాచార్యులేనని, ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ రాహుల్ మాత్రమే ఆ పనిచేశారని కొనియాడారు. భారత్ జోడో యాత్ర లక్ష్యం దేశాన్ని ఏకం చేయడమేనన్న ఆయన.. ఈ యాత్రను వ్యతిరేకించే వారంతా దేశానికి, మానవాళికి శత్రువులని అన్నారు.

ఫరూక్ అబ్దుల్లా యాత్రపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ‘హిందూ ఉగ్రవాదం’, ‘కాషాయ ఉగ్రవాదం’ పదాల సృష్టికర్త అయిన రాహుల్‌ను శంకరాచార్యులతో పోల్చడం తగదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి హెహజాద్ పూనవాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, భారత్ జోడో యాత్ర కశ్మీర్ చేరుకోవడంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. చాలా ఆనందంగా ఉందని, సొంతింటికి వచ్చిన భావన కలుగుతోందని అన్నారు. తన మూలాలు ఇక్కడే ఉన్నాయని ట్వీట్ చేశారు.

Related posts

కర్ణాటకలో కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యత… పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడి!

Drukpadam

పంజాబ్ లెక్కింపు పూర్తి.. ఆప్‌కు 92 సీట్లు!

Drukpadam

ఇంకా భ్రమల్లో బతుకుతున్న కాంగ్రెస్ …బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో మోడీ ధ్వజం…

Drukpadam

Leave a Comment