Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు ప్రమోషన్ …!

ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రులుగా ప్రమోషన్ ఇస్తున్న కేజ్రీవాల్

  • మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన మనీశ్ సిసోడియా
  • మనీలాండరింగ్ ఆరోపణలపై జైలు పాలైన సత్యేంద్ర జైన్
  • తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన సిసోడియా, సత్యేంద్ర 

ఢిల్లీ క్యాబినెట్ లో రెండు మార్పులు జరగనున్నాయి. మద్యం కుంభకోణం ఆరోపణలపై సీబీఐ అరెస్ట్ చేసిన ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో పాటు సత్యేంద్ర జైన్ తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. వీళ్ల స్థానాల్లో ఎమ్మెల్యేలు సౌరభ్ భరద్వాజ్, అతిషిని క్యాబినెట్ లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించారు. ఈ ఇద్దరి పేర్లను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు పంపించారు. ఎల్జీ ఆమోదం తర్వాత కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగే జరగనుంది. రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది.

కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీశ్ సిసోడియాను సీబీఐ  అరెస్టు చేసింది. మరోవైపు మనీలాండరింగ్ కేసులో ప్రమేయం ఉందటూ  గతేడాది మేలో సత్యేందర్ జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. ఈ ఇద్దరి దగ్గర 20 పోర్ట్‌ ఫోలియోలు ఉన్నాయి. సిసోడియా ఢిల్లీ ఉపముఖ్యమంత్రిగానే కాకుండా విద్యతో సహా అనేక ఉన్నత స్థాయి శాఖలను చూస్తున్నారు. జైన్ ఢిల్లీ ఆరోగ్య, జైళ్ల శాఖ మంత్రిగా ఉన్నారు. సిసోడియా దగ్గర ఉన్న విద్య, ఆర్థిక శాఖ సహా కొన్న పోర్ట్‌ఫోలియోలు కైలాష్ గహ్లోట్, రాజ్ కుమార్ ఆనంద్‌లకు కేటాయించనున్నారు. వచ్చే వారం మొదలయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగాలని సీఎం కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Related posts

టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడుకు సీఐడీ నోటీసులు…

Drukpadam

ఫైటర్ షర్మిల …అడ్డంకులమధ్య 3500 కి .మీ పాదయాత్ర !

Drukpadam

సుపరిపాలన కోసం మంచి నిర్ణయం…మాజీ ఎంపీ పొంగులేటి…

Drukpadam

Leave a Comment