ఆంధ్రప్రదేశ్

ఒక్క పిడుగు.. 300 మేకల మృత్యువాత!

ఒక్క పిడుగు.. 300 మేకల మృత్యువాత!

  • ఉత్తరకాశీ ప్రాంతంలో విషాదం
  • ఇంత భారీ సంఖ్యలో చనిపోవడం అరుదు
  • నష్ట నివారణకు బృందాన్ని పంపిన విపత్తుల నిర్వహణ విభాగం

పిడుగుపాటుకు మనుషులు, పశువులు మృత్యువాత పడడం తెలిసిన విషయమే. కానీ, ఉత్తరకాశీలోని ఖట్టు ఖాల్ అటవీ ప్రాంతంలో పిడుగు పాటుకు ఏకంగా 350 మేకలు చనిపోయాయి. శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బర్సు గ్రామానికి చెందిన సంజీవ్ రావత్ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలసి గొర్రెలు, మేకలను రిషికేష్ నుంచి ఉత్తరకాశీకి తీసుకొస్తున్న క్రమంలో పిడుగు పడింది.

విపత్తుల నిర్వహణ విభాగం ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఓ బృందాన్ని పంపించింది. నష్టాన్ని అంచనా వేసి నివేదిక సమర్పించిన తర్వాత, దాన్ని జిల్లా యంత్రాంగానికి పంపిస్తామని విపత్తుల నిర్వహణ విభాగం ప్రకటించింది. పిడుగుపాటుకు పదుల సంఖ్యలో పశువులు మరణించిన సంఘటనలు విన్నాం. కానీ,ఇప్పుడు ఏకంగా 350 వరకు చనిపోయాయి.

Related posts

జపాన్ కుబేరుడు అంతరిక్ష యాత్ర సక్సెస్… సురక్షితంగా భూమి పైకి!

Drukpadam

ఏపీలో మాజీమంత్రుల ఇళ్లపై కొనసాగుతున్న దాడులు …

Ram Narayana

రేవంత్ రెడ్డి, నేను సమానమే… చట్టం తన పని చేయకుంటే ఇక నా చట్టం ప్రారంభిస్తా..!: ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి హెచ్చరిక

Ram Narayana