Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

న్యాయవాదులు సమ్మె చేయకూడదు: సుప్రీంకోర్టు..!

న్యాయవాదులు సమ్మె చేయకూడదు: సుప్రీంకోర్టు..!

  • విధులు కూడా బహిష్కరించకూడదని ఆదేశం
  • వారి సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టులకు సూచన
  • జిల్లా స్థాయిలోనూ అలాంటి కమిటీలు ఏర్పాటు చేసుకోవచ్చని సూచన

తమ డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోసం న్యాయవాదులు విధులు బహిష్కరించి, సమ్మె చేస్తుంటారు. దేశ వ్యాప్తంగా లాయర్ల సమ్మె విషయాన్ని సుమోటాగా తీసుకొని విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాదులు సమ్మె చేయకూడదని, విధులు బహిష్కరించకూడదని స్పష్టం చేసింది. న్యాయవాదుల నిజమైన సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టులకు సూచించింది. కేసుల నమోదు, లిస్టింగ్‌లో ఉన్న సమస్యలు, కింది కోర్టుల సిబ్బంది ప్రవర్తనపై ఫిర్యాదులు స్వీకరించి, విచారణ జరపడానికి కమిటీలు ఏర్పాటు చేయాలని జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లాల ధర్మాసనం ఆదేశించింది.

ఈ కమిటీకి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారని, ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు ఉంటారని తెలిపింది. జిల్లా స్థాయిలో కూడా ఇలాంటి కమిటీని ఏర్పాటు చేయాల్సి వస్తే హైకోర్టు పరిశీలించవచ్చని కోర్టు పేర్కొంది. బార్‌ కౌన్సిల్ లోని సభ్యులెవరూ సమ్మెకు వెళ్లరాదని, విధులు బహిష్కరించకూడదని కోర్టు పునరుద్ఘాటించింది.

Related posts

హైటెక్ దొంగ.. 100 రోజుల్లో 200 విమానాల్లో ప్రయాణించి కోట్లు కొట్టేశాడు!

Ram Narayana

ప్రయాణికుల్లా టికెట్లు కొనుక్కుని విమానాశ్రయంలోకి ఆందోళనకారుల ఎంట్రీ.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఉద్రిక్తత.. 44 విమానాల రద్దు

Ram Narayana

5 వేల సంవత్సరాలుగా భారత్ లౌకిక రాజ్యమే.. ఆరెస్సెస్ చీఫ్ భగవత్

Ram Narayana

Leave a Comment