Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని పార్టీలు ఏకం కావాలి …కేజ్రీవాల్

సుప్రీంకోర్టు తీర్పును కూడా కేంద్రం లెక్కచేయడంలేదు: కేజ్రీవాల్

  • హైదరాబాద్ వచ్చిన ఆప్ ముఖ్యమంత్రులు
  • సీఎం కేసీఆర్ తో కేజ్రీవాల్, భగవంత్ మాన్ సమావేశం
  • అనంతరం ప్రెస్ మీట్

హైదరాబాదులో సీఎం కేసీఆర్ తో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సమావేశమైన సంగతి తెలిసిందే. సమావేశం అనంతరం ముగ్గురు సీఎంలు  మీడియా సమావేశం నిర్వహించారు.

కేజ్రీవాల్ మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిందని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును కూడా లెక్కచేయడంలేదని అన్నారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం అన్ని పార్టీలు ఏకం కావాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మాట్లాడుతూ, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకే అధికారాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. గవర్నర్ వ్యవస్థను మోదీ సర్కారు దుర్వినియోగం చేస్తోందని భగవంత్ మాన్ విమర్శించారు. బీజేపీయేతర ప్రభుత్వాలను వేధించేందుకు గవర్నర్ లను వాడుకుంటున్నారని ఆరోపించారు.

కేసీఆర్ నివాసంలో కేజ్రీవాల్, భగవంత్ మాన్ లంచ్

KCR welcomes Kejriwal and Bhagwant Mann

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హైదరాబాదులో ఇవాళ ప్రగతిభవన్ కు విచ్చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో వారు భేటీ అయ్యారు. ప్రగతి భవన్ కు విచ్చేసిన ఆప్ ముఖ్యమంత్రులకు కేసీఆర్ ఆత్మీయ స్వాగతం పలికారు. ఇరువురు సీఎంలతో కలిసి కేసీఆర్ లంచ్ చేయనున్నారు. అనంతరం సమావేశం జరపనున్నారు.

అధికారుల పోస్టింగులు, బదిలీలపై కేంద్రం తెచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ, కేజ్రీవాల్ ముమ్మర పోరాటం చేస్తున్నారు. ఈ అంశంలో సీఎం కేసీఆర్ మద్దతు కోరేందుకే కేజ్రీవాల్ హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది.

ఓవైపు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుండగా, మొత్తం ఏడుగురు సీఎంలు ఆ సమావేశానికి డుమ్మాకొట్టినట్టు సమాచారం. ఆ ఏడుగురిలో ముగ్గురు కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ హైదరాబాదులో సమావేశమవుతున్నారు.

Related posts

12 డిమాండ్లతో టీడీపీ సీనియ‌ర్ నేత‌ల‌తో క‌లిసి దీక్ష‌కు దిగిన చంద్ర‌బాబు…

Drukpadam

సోము వీర్రాజుకు ఆ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది: సీపీఐ నారాయణ!

Drukpadam

పంజాబ్ లో టీకాలను ప్రవేట్ ఆసుపత్రులకు అమ్మటంపై అకాలీదళ్ ఫైర్…

Drukpadam

Leave a Comment