Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ముందు 5 డిమాండ్లు పెట్టిన రెజ్లర్లు.. అవి ఏంటంటే..!

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ముందు 5 డిమాండ్లు పెట్టిన రెజ్లర్లు.. అవి ఏంటంటే..!

  • అనురాగ్ ఠాకూర్ తో ముగిసిన రెజ్లర్ల భేటీ
  • చర్చలకు హాజరైన భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్
  • బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్

కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ తో రెజ్లర్లు భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ ల భేటీ ముగిసింది. అనురాగ్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రెజ్లర్లు ఐదు డిమాండ్లను కేంద్ర మంత్రి ముందు ఉంచారు. కేంద్ర ప్రభుత్వం, రెజ్లర్ల మధ్య జరిగిన రెండో సమావేశం ఇది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్వహించిన తొలి సమావేశం ఎలాంటి పరిష్కారాన్ని చూపించలేకపోయింది. ఇప్పుడు క్రీడా మంత్రితో రెండో సమావేశం జరిగింది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

అనురాగ్ ఠాకూర్ ముందు రెజ్లర్లు ఉంచిన ఐదు డిమాండ్లు ఇవే:

  • ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ కు స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి.
  • ఫెడరేషన్ చీఫ్ గా మహిళను నియమించాలి.
  • రెజ్లింగ్ ఫెడరేషన్ లో బ్రిజ్ భూషణ్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ ఉండకూడదు.
  • కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం నాడు తమపై పోలీసులు పెట్టిన కేసులను ఎత్తివేయాలి.
  • మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయాలి.

మరోవైపు తన గ్రామంలో ఒక కార్యక్రమానికి వెళ్లిన కారణంగా అనురాగ్ తో భేటీకి మరో రెజ్లర్ వినేశ్ ఫొగాట్ హాజరుకాలేదు.

అనురాగ్ ఠాకూర్ తో భేటీ.. జూన్ 15 వరకు నిరసనలకు బ్రేక్ ఇచ్చిన రెజ్లర్లు!

Wrestlers suspend protest till June 15 after meeting with Sports Minister Anurag Thakur

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తో చాలారోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న టాప్ రెజ్లర్లతో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ భేటీ అయ్యారు. ఈ భేటీ సానుకూలంగా ముగిసింది. బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవడానికి జూన్ 15వ తేదీ వరకు గడువు ఇచ్చారు రెజ్లర్లు. అప్పటి వరకు తమ నిరసనను తాత్కాలికంగా నిలిపివేస్తామని, గడువులోగా చర్యలు తీసుకోకుంటే జూన్ 15 తర్వాత తిరిగి నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

పోలీసులు జూన్ 15వ తేదీ లోగా విచారణను పూర్తి చేస్తామని చెప్పారని, కాబట్టి అప్పటి వరకు తమ నిరసనను ఆపివేస్తున్నామని, ఆ లోగా చర్యలు తీసుకోవాల్సిందేనని సాక్షి మాలిక్ అన్నారు. తాము జూన్ 15 వరకు నిరసనను విరమించుకుంటున్నామని, కానీ చర్యలు తీసుకోకుంటే ఈ నిరసన పూర్తి కానట్లేనని బజ్ రంగ్ పునియా అన్నారు.

రెజ్లర్లతో భేటీ అనంతరం అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ, రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీని కలిగి ఉందని, దీనికి మహిళ సారథ్యం వహిస్తున్నారని చెప్పారు. రెజ్లర్లతో భేటీ సానుకూలంగా ముగిసిందన్నారు. రెజ్లర్ల ఆరోపణలకు సంబంధించి జూన్ 15వ తేదీ లోగా ఛార్జిషీట్ దాఖలు చేస్తారన్నారు. రెజ్లర్లపై అన్ని ఎఫ్ఐఆర్ లు కూడా వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే బ్రిజ్ భూషణ్ కు మరోసారి ఆ పదవి కట్టబెట్టవద్దని రెజ్లర్లు కోరారని చెప్పారు. జూన్ 15వ తేదీ వరకు వారు ఎలాంటి నిరసన వ్యక్తం చేయరన్నారు.

Related posts

ఆర్టికల్ 270 రద్దు తర్వాత జమ్మూ కాశ్మిర్ లో అభివృద్ధి పరుగులు పెడుతుందట …!

Ram Narayana

సంచలనంగా మారిన లిక్కర్ స్కాం లో కేజ్రీవాల్ పాత్ర…!

Drukpadam

ఆత్మహత్యాయత్నం చేసిన తమిళనాడు ఎంపీ మృతి

Ram Narayana

Leave a Comment