Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

అమిత్ షా ఖమ్మం సభ ప్రతిష్టాత్మకం, జయప్రదం చేయండి …బండి సంజయ్..!

అమిత్ షా ఖమ్మం సభ ప్రతిష్టాత్మకం, జయప్రదం చేయండిబండి సంజయ్..!
అనేక జిల్లాలు కోరినప్పటికీ అమిత్ షా పర్యటన ఖమ్మం కు ఇచ్చాం
జనసమీకరణలో పోటీపడాలి
కాంగ్రెస్ , బీఆర్ యస్ గెండెలదరాలి
కమ్యూనిస్టులు దాల్చా పార్టీలువారి ఖేల్ ఖతం
సూది దబ్బడం అన్న కేసీఆర్ తో పొత్తు సిగ్గు చేటు ..
ఖమ్మం లో జరిగిన నిరుద్యోగ నిరసన ర్యాలీ జయప్రదం
దాన్ని స్ఫూర్తిగా తీసుకోని పనిచేయాలి

అమిత్ షా ఈనెల 15 ఖమ్మం సభకు వస్తున్నారు . ఈసభకు జనసమీకరణ ప్రతిష్ట్మాకంగా తీసుకోని జయప్రదం చేయాలనీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు నిచ్చారు . శుక్రవారం ఖమ్మం వచ్చిన బండి సంజయ్ సభ ఏర్పాట్ల గురించి స్థానిక నాయకులతో సమీక్షా నిర్వహించారు . ఈసందర్భంగా ముఖ్య నేతలతో ఆయన మాట్లాడుతూ అమిత్ షా మొదటిసారి ఖమ్మం వస్తున్నారు . ఖమ్మం నాయకుల మీద నమ్మకం ఉంది . ఎక్కడ నిరుద్యోగ ర్యాలీకి ఎంతమంది వస్తారంటే వేయి మంది మాత్రమే వస్తారని చెప్పారు .కానీ ఎంతమంది వచ్చారు . కాంగ్రెస్ కంటే ఎక్కువ మంది వచ్చారువచ్చారారాలేదాఅంటూ అందుకే ఖమ్మం గురించి అన్ని చోట్ల చూపుతుంటాఇక్కడ నిర్మాణం బాగుంది తలచుకుంటే చేసే నాయకులూ ఉన్నారు . కాంగ్రెస్ జిల్లా అంటున్నారు .ఇక్కడ పువ్వు వికసించాలిఅప్పుడే మనం మాట నిలబెట్టుకున్నవాళ్ళమౌతాం అని అన్నారు . బీజేపీకి తిరుగు లేదుప్రజల్లో ఆదరణ ఉంది .మనం బీజేపీ విధానాలను ప్రజల్లోకి తీసుకోని వెళ్ళాలి అన్నారు .

కమ్యూనిస్టులు దాల్చా పార్టీలు

కమ్యూనిస్టుల గురించి ప్రస్తావిస్తూ అవి దాల్చా పార్టీలని వ్యంగ్య బాణాలు సంధించారు . వారు కూరగాయలు అమ్మే వారిని , కూలీలను పార్టీ ధర్నాలకు ,సభలకు తీసుకోని వస్తారని ….దాల్చా అంటే తెల్సాటోకెన్ ఇచ్చి హోటల్ లో భోజనం పెట్టించి ప్రజలను ధర్నాలకు తీసుకోని వస్తారని ,
వారి పని అయిపోయిందని ఎద్దవా చేశారువాటిని సూది దబ్బడం లేని పార్టీలు అని కేసీఆర్ అన్న విషయాన్నీ గుర్తు చేశారు .అయినప్పటికీ సిగ్గు లేకుండా కేసీఆర్ తో కలిసి వెళ్లేందుకు సిద్దపడుతున్నారని అన్నారు .

భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి అనేక పార్టీలు ఓర్వలేక పోతున్నాయని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు .దేశానికి నరేంద్రమోడీ అమిత్ షా నాయకత్వం అవసరమని దేశ ప్రజలే కాకుండా ప్రపంచమే గుర్తించిందని అన్నారు . అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న భారత్ వైపు ప్రపంచం చూస్తున్నదని పేర్కొన్నారు . సమావేశంలో బీజేపీ జాతీయ నాయకులు, తమిళనాడు కోఇంచార్జి డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి , మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు , జిల్లా నాయకులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి , జిల్లా బీజేపీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ , సీనియర్ నాయకులు గంటల విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు

 

Related posts

ఉత్తరాఖండ్ లో బీజేపీ షాక్ …కాంగ్రెస్ లో చేరిన మంత్రి!

Drukpadam

కాపు రిజర్వేషన్ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన జీవీఎల్ నరసింహారావు!

Drukpadam

నేటి సాయంత్రం కర్ణాటక సీఎల్పీ సమావేశం ….సీఎంగా ఎవరు …?

Drukpadam

Leave a Comment