Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మణిపుర్‌లో నగ్నంగా మహిళల ఊరేగింపు.. అసలేం జరిగింది?

  • మే 3 నుండి జాతుల వైరంతో అట్టుడుకుతున్న మణిపుర్
  • భద్రత కోసం కొండ ప్రాంతాల్లోకి వెళ్లిన మహిళలు
  • మహిళలపై అత్యాచారం జరిగినట్లుగా ప్రచారం 
  • తమవారిపై అత్యాచారం జరిగిందని ఓ గ్రామంపై కొంతమంది దాడి

మణిపుర్ లో ఇద్దరు మహిళల్ని మే నెలలో నగ్నంగా ఊరేగించిన సంఘటన వెలుగు చూడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. జాతుల మధ్య ఘర్షణలతో మణిపుర్ అట్టుడుకుతోంది. మే నెల 3 నుండి ఈ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆ మరుసటి రోజునే ఇద్దరు మహిళలను కొంతమంది వ్యక్తులు లాక్కెళ్లి, నగ్నంగా ఊరేగించిన వీడియో నిన్న బయటకు వచ్చింది. అంతేకాదు, బాధిత మహిళల్లోని ఓ టీనేజ్ సోదరుడిని అదే వ్యక్తులు హత్య చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇంతటి దారుణాలకు ఓ ఫేక్ వీడియో కారణమని చెబుతున్నారు. కాగా, ఈ ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ నుండి ప్రతి ఒక్కరు ఖండించారు. మహిళలను నగ్నంగా ఊరేగించడంపై సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

షెడ్యూల్ తెగ అంశంపై మెయిటీ, కుకీ జాతుల మధ్య గత రెండు నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ఇది హింసాత్మకంగా మారి, పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెండు వర్గాల మధ్య దాడులు, ప్రతిదాడులు చోటు చేసుకోవడంతో ఇద్దరు మహిళలు భద్రత కోసం కొండ అంచుల్లోకి వెళ్లారు. అయితే తమ కమ్యూనిటికీ చెందిన మహిళలు అత్యాచారానికి గురయ్యారనే ప్రచారం జరగడంతో ఆ కమ్యూనిటీకి చెందిన వారు ఓ గ్రామంపై దాడి దాడి చేశారు. ఓ గ్రూప్ ను వెంబడించారు.

ఆ గ్రూప్ లో ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. ఇందులో 56 ఏళ్ల వ్యక్తి, అతని 19 ఏళ్ల తనయుడు, 21 ఏళ్ల కూతురు ఉన్నారు. వారితో పాటు మరో ఇద్దరు మహిళలు ఉన్నారు. వారిలో ఒకరి వయస్సు 42 ఏళ్లు, మరొకరి వయస్సు 52 ఏళ్లు.

ఎఫ్ఐఆర్ ప్రకారం… ఈ గ్రూప్ అడవికి వెళ్తున్న సమయంలో ఓ పోలీస్ టీంను గుర్తించింది. ఈ పోలీసులు నాంగ్ పోక్ సెక్మై పోలీస్ స్టేషన్ కు చెందినవారు. ఈ గ్రూప్ పోలీసుల సంరక్షణలో వెళ్తుండగా కొంతమంది వచ్చి వారిని లాక్కెళ్లారు. వారిని పోలీస్ కస్టడీ నుండి తీసుకు వెళ్లారు.

ఈ సమయంలో 19 ఏళ్ల యువకుడు తన 21 ఏళ్ల సోదరిని ఆ గుంపు నుండి రక్షించే ప్రయత్నం చేసినప్పుడు అతనిని చంపేశారు. ఇందులో ఒక మహిళపై అత్యాచారం జరిగినట్లుగా బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా మే 18న జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును మే 21న నోగ్ పోక్ సెక్మై పోలీస్ స్టేషన్ కు బదలీ చేశారు. 

మణిపుర్ లో మే 3వ తేదీ నుంటి ఇంటర్నెట్ నిలిపివేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వెలుగు చూడటంతో పాటు వైరల్ గా మారింది. ఈ వీడియో వెలుగు చూసిన ఒకరోజు తర్వాత అంటే ఈ రోజు ఆ గుంపులోని ఒక వ్యక్తి హెరాదాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను ఆ గుంపులో ఆకుపచ్చ రంగు టీషర్ట్ లో కనిపించినట్లు పోలీసులు తెలిపారు.

ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా వీడియోలోని ఇతర నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దాదాపు డజను బృందాలు ఈ కేసుపై పని చేస్తున్నాయన్నారు. అయితే 77 రోజులుగా ఎందుకు చర్యలు తీసుకోలేదో స్పష్టంగా తెలియడం లేదని అంటున్నారు.

Related posts

షర్మిల, సునీతపై జగన్ ఫైర్…!

Ram Narayana

వైద్యరంగంలో సంచలనం.. ఎయిడ్స్‌కు వ్యాక్సిన్ కనుగొన్న ఇజ్రాయెల్ పరిశోధకులు!

Drukpadam

తాజ్ మహల్ పై కొత్త గొడవ …

Drukpadam

Leave a Comment