Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జగన్ ను తెలంగాణనే తన్ని తరిమేసింది..పవన్ కళ్యాణ్ …పవన్ కళ్యాణ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు …వైసీపీ

సోనియాగాంధే ఏం చేయలేకపోయింది.. జగన్‌ను నువ్వేం చేస్తావ్?: పవన్ పై రోజా ఫైర్

  • బ్రో సినిమాను ఆడించుకోలేకపోయాడు కానీ జగన్‌ను ఆడిస్తాడా? అని ఎద్దేవా
  • పవన్ కల్యాణ్ ఆటలో అరటిపండు.. అలాంటిది నువ్వేం చేస్తావని ఆగ్రహం
  • చంద్రబాబు చెప్పినట్లు మాట్లాడుతాడని విమర్శలు
  • జనసేన, ప్రజారాజ్యం వచ్చి 10, 15 ఏళ్లు అవుతున్నాయి కానీ చేసిందేం లేదని వ్యాఖ్య

బ్రో సినిమాను నాలుగు ఆటలు ఆడించుకోలేకపోయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీ అధినేత జగన్‌పై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ… పవన్ కల్యాణ్ నిన్నటి మీటింగ్‌లో జగన్‌పై విమర్శలు చేశారని, అమిత్ షాకు చెప్పి జగన్‌ను ఆటాడిస్తానని చెబుతున్నాడని, కానీ తన సినిమాను ఆడించుకోలేక చతికిలపడ్డ జనసేనాని జగన్‌ను ఆడిస్తాడా? అని ఎద్దేవా చేశారు. జగన్‌ను ఆడించడం… ఓడించడం దేశాన్నే గడగడలాడించిన సోనియా గాంధీ వల్లే కాలేదన్నారు.

ఈ రాజకీయ ఆటలో నువ్వు అరటిపండు.. అలాంటిది నువ్వేం చేస్తావని ధ్వజమెత్తారు. చంద్రబాబు, పచ్చ ఛానళ్లు ఇచ్చే అబద్దాలు పవన్ మాట్లాడుతారన్నారు. సినిమాల్లో రీమేక్‌లు సక్సెస్ కావొచ్చునేమో.. కానీ రాజకీయాల్లో రీమేక్‌లు సక్సెస్ కావని విమర్శించారు. చంద్రబాబు మాట్లాడిందే పవన్ మాట్లాడుతారని, ఈనాడు, ఆంధ్రజ్యోతిలలో వచ్చిందే చెబుతారన్నారు. జనసేనానికి ఓ జెండా, అజెండా లేవన్నారు.

ప్రజారాజ్యం, జనసేన పార్టీలు వచ్చి పదిపదిహేనేళ్లవుతున్నాయని, కానీ నమ్ముకున్న వారి కోసం ఇది చేశామని చెప్పే పరిస్థితి లేదన్నారు. పవన్ మాట్లాడితే చాలు చంద్రబాబుకు ఓటేయమన్నట్లుగా మాట్లాడుతున్నారన్నారు. మీ తల్లిని, మీ కార్యకర్తలను, మీ జనసేన పిల్లసేనల్ని తిడితే కనీసం పట్టించుకోలేదని, కానీ ప్యాకేజీ కోసం లొంగుతారన్నారు. బాలకృష్ణ ఇంటర్వ్యూ కోసం వెళ్తారు… చంద్రబాబు ఇంటికి వెళ్తారు… టీడీపీకి ఓటు వేయమని చెబుతారు.. ఇదేనా రాజకీయం? అన్నారు. దత్తపుత్రుడు ఎలా తయారయ్యాడంటే మొరగమంటే మొరుగుతున్నాడు.. కరవమంటే కరుస్తున్నాడని విమర్శించారు. ఒక వింత జీవిలా తయారయ్యాడన్నారు.

తెలంగాణ వారు తన్ని తరిమేస్తే జగన్ ఉత్తరాంధ్రపై పడ్డాడు: పవన్ కల్యాణ్ తీవ్రవ్యాఖ్యలు

  • మీడియా కూడా ఈ అన్యాయాన్ని ప్రజలకు చెప్పాలన్న పవన్ 
  • తెలంగాణను కూడా ఇలాగే దోపిడీ చేశారు.. ఉత్తరాంధ్రలో ఆగాలి
  • వరదలు, తుపానులు వచ్చినప్పుడు రుషికొండ కాపాడుతుందని వెల్లడి 
  • కిర్లంపూడిలో ఓ మూలకు కూర్చోకుండా ఇక్కడ సీఎం కార్యాలయం అవసరమా? అంటూ ఎద్దేవా 

చట్టాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఆయనే వాటిని ఉల్లంఘిస్తున్నారని, ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. శుక్రవారం జనసేనాని విశాఖలోని రుషికొండకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. కొండపైకి వెళ్లే దారిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. రుషికొండ వద్దకు నడుచుకుంటూ వెళ్లడానికి జనసేనాని ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డు వద్ద నుండి చూడాలని సూచించారు. దీంతో అక్కడి నుండే పరిశీలించారు. కొండను తవ్వడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… చట్టాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి, ఆయనే ఉల్లంఘిస్తే ఎలా? అని ప్రశ్నించారు. విపక్షాలు, ఇతరులు ఎవరైనా శాంతియుతంగా చిన్న నిరసన తెలిపినా అరెస్టు చేస్తారని, కానీ జగన్ ప్రభుత్వం మాత్రం కొండను తవ్వినా ఏం కాదా? అన్నారు. తెలంగాణను ఇలాగే దోపిడీ చేస్తే తన్ని తరిమేశారని, ఇప్పుడు ఉత్తరాంధ్రపై కన్నుపడిందన్నారు. వరదలు, తుపానులు వచ్చినప్పుడు కొట్టుకుపోకుండా రుషికొండ కాపాడుతుందన్నారు. వీరు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను దోచేస్తున్నారన్నారు. ఇలాంటి వ్యక్తులను ఎన్నుకుంటే దోపిడి ఇలాగే ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి ఒక ఇల్లు సరిపోదా? ఇంకా ఎన్ని ఇళ్లు కావాలన్నారు. కిర్లంపూడి లేఔట్ తాకట్టు పెట్టి, ఇక్కడ అవసరమా? అన్నారు. రిషికొండలో నిర్మాణాలకు గ్రీన్ ట్రైబ్యునల్ అనుమతి ఉందా? చెప్పాలన్నారు.

ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయం కోసం ఇలా చేయాలా? ఓ మూలకు కూర్చోకుండా అద్భుతంగా కనిపించడం కోసం ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం కావాలా? అని ప్రశ్నించారు. కిర్లంపూడిలో క్యాంప్ కార్యాలయం పెట్టుకోవచ్చు కదా? అన్నారు. తెలంగాణను దోచింది చాలక ఉత్తరాంధ్ర మీద పడ్డారన్నారు. ప్రజలు శాంతియుతంగా ఉంటారని చెప్పి, ఉత్తరాంధ్రను దోపిడీ చేయాలనుకోవడం తప్పన్నారు. ఈ అక్రమాన్ని, అన్యాయాన్ని మీడియా కూడా ప్రజలకు చెప్పాలన్నారు. ఈ అక్రమాన్ని తాను వెలికి తీసుకు వస్తున్నానని, తానొక్కడినే చేయడం కాదని, అందరూ ప్రజలకు చెప్పాలన్నారు. ఉత్తరాంధ్రలో దోపిడీ ఆగిపోవాలన్నారు. మూడు రాజధానులు అంటారని, కానీ ఇప్పటి వరకు ఒక్క రాజధానికే దిక్కు లేదన్నారు.

Related posts

విమానయాన రంగంలో కొత్త శకం.. ప్రపంచంలో ఎక్కడికైనా రెండు గంటల లోపే..!

Ram Narayana

భార‌త 15 రాష్ట్రప‌తిగా ద్రౌప‌ది ముర్ము….

Drukpadam

సమంతను ప్రీతమ్ జుకాల్కర్ జీజీ అని పిలిచేవారు …జీ జీ అంటే అక్క: మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ …

Drukpadam

Leave a Comment