Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

వరుసగా మూడోసారి గవర్నర్ తేనీటి విందుకు కేసీఆర్ దూరం.. కానరాని కాంగ్రెస్, బీజేపీ కీలక నేతలు

  • విందుకు హాజరుకాని బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  • విందులో కనిపించని రాజకీయ నేతల హడావుడి
  • హాజరైన హైకోర్టు సీజే, పలువురు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై తేనీటి విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ డుమ్మా కొట్టారు. గవర్నర్ ఏర్పాటు చేసిన ‘రాజ్ భవన్ ఎట్ హోమ్’ కార్యక్రమానికి కేసీఆర్ దూరంగా ఉండటం వరుసగా ఇది మూడోసారి. కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ హాజరుకాలేదు.

అలాగే, కాంగ్రెస్, బీజేపీకి చెందిన కీలక నేతలు కూడా రాలేదు. దీంతో, తేనీటి విందు కార్యక్రమంలో రాజకీయ నాయకుల హడావుడి కనిపించలేదు. ఈ కార్యక్రమానికి హైకోర్టు చీఫ్ జస్టిస్, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు.

మరోవైపు అంతకు ముందే గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. తేనీటి విందుకు కేసీఆర్ కు ఆహ్వానం పంపామని… ఆయన రావడం, రాకపోవడం రాజ్ భవన్ పరిధిలో లేదని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ వైఖరి తనను ఎంతో బాధించిందని అన్నారు. గవర్నర్ల పట్ల సీఎంల వైఖరి ఇలా ఉండటం మంచిది కాదని చెప్పారు. 

Related posts

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: వచ్చే నెలలో రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల సంఘం

Ram Narayana

హైదరాబాద్ నగరం గూగుల్ మ్యాప్స్‌పై చిరంజీవి! మెగాభిమానం అంటే ఇదే!

Ram Narayana

రైతు రుణమాఫీ సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ …ఇది కాంగ్రెస్ ఘనతే అంటున్న రేవంత్ రెడ్డి

Ram Narayana

Leave a Comment