Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

ఏపీ పరిణామాలను పరిశీలిస్తున్నామన్న నడ్డా… వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టాలని సుజనాకు సూచన

  • ఆంధ్రప్రదేశ్ అంశాలు నడ్డాతో చర్చించినట్లు చెప్పిన సుజనా చౌదరి
  • చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందనే ప్రచారాన్ని తిప్పికొట్టాలని నడ్డా సూచించినట్లు వెల్లడి
  • వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామన్న సుజనా

ఏపీ రాజకీయాలపై కేంద్ర బీజేపీ పెద్దలు ఓ కన్నేసినట్టు తెలుస్తోంది. మొన్న లోకేశ్ తో సమావేశం సందర్భంగా అమిత్ షా కూడా ఏపీ పరిణామాలను గమనిస్తున్నామని పేర్కొనగా, ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా అదే మాట అన్నారు. ఏపీ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి నేడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందన్న ప్రచారం వైసీపీ పనే అని సుజనా… నడ్డాకు వివరించారు. దాంతో ఆయన వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టేలా బీజేపీ కార్యాచరణ ఉండాలని దిశానిర్దేశం చేశారు.

నడ్డాతో భేటీ అనంతరం సుజనా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాల గురించి తెలుసుకుంటున్నామని తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తమతో చెప్పారని  సుజనా అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో రాజకీయ పరిణామాలపై జేపీ నడ్డాతో చర్చించినట్లు చెప్పారు. 

వైసీపీ అసత్య ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని తమకు ఆయన సూచించారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ అనుసరించాల్సిన వ్యూహంపై కూడా అధినేతతో చర్చించామన్నారు.

Related posts

కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంది.. ఆలోచించి ఓటేయండి: వైఎస్ జగన్

Ram Narayana

చంద్రబాబు పై విజయసాయి సెటైర్లు …

Ram Narayana

మూడు పార్టీల అజెండా ఒక్కటే: చంద్రబాబు

Ram Narayana

Leave a Comment