తెలంగాణ వార్తలు

చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయా: కేటీఆర్

  • నిన్నటితో ముగిసిన పోలింగ్ ప్రక్రియ
  • బీఆర్ఎస్ గెలుపుపై ధీమాగా ఉన్న కేటీఆర్
  • ఎగ్జాక్ట్ పోల్స్ మనకు శుభవార్తను చెపుతాయని ట్వీట్
I slept well after many days says KTR

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిన్న ముగిసింది. ఈవీఎంలు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. ఆదివారం నాడు (3వ తేదీ) కౌంటింగ్ జరగనుంది. ఏ పార్టీ గెలుస్తుందో అనేది నేతలను, ప్రజలను టెన్షన్ కు గురిచేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ గెలుపుపై మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఆయన అంటున్నారు. తాజాగా ఆయన ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. చాలా రోజుల తర్వాత తాను ప్రశాంతంగా నిద్రపోయానని ఆయన చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ లో అతిశయోక్తులు ఉంటాయని… ఎగ్జాక్ట్ పోల్స్ (అసలైన ఫలితాలు) మనకు శుభవార్తను చెపుతాయని అన్నారు. కేసీఆర్ తోనే తెలంగాణ అనే హ్యాష్ ట్యాగ్ ను జతచేశారు.

Related posts

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. కేసీఆర్ కు గవర్నర్, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవులు: రేవంత్ రెడ్డి

Ram Narayana

జపాన్ పర్యటనలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బిజీ బిజీ!

Ram Narayana

హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ!

Ram Narayana