Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఎలక్షన్ కమిషన్ వార్తలు

 జూన్ 16తో ఏపీ అసెంబ్లీ గడువు ముగింపు: కేంద్ర ఎన్నికల సంఘం

  • మూడేళ్ల కంటే ఎక్కువ ఒకే చోట పనిచేస్తున్న అధికారులను తక్షణమే బదిలీ చేయాలని ఆదేశం
  • సొంత జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులనూ ట్రాన్స్‌ఫర్ చేయాలని రాష్ట్రాలకు సూచన
  • 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు

వచ్చే ఏడాది 2024లో ఆంధ్రప్రదేశ్‌ సహా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలకు భారత ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో పాల్గొననున్న అధికారుల బదిలీలపై కీలక సూచనలు చేసింది. సొంత జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఒకే చోట మూడేళ్ల కంటే ఎక్కువకు కాలంగా పనిచేస్తున్న అధికారులను తక్షణమే బదిలీచేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. పోలీసులు సహా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు అందరికీ  ఈ నియమాలు వరిస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కాగా 2024లో ఆంధ్రప్రదేశ్‌తోపాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ గడువు జూన్ 16తో ముగియనుందని ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తావించింది.

Related posts

రాజకీయ పార్టీల హోర్డింగ్స్‌పై ప్రచురణకర్త, ప్రింటర్స్ పేర్లు ఉండాల్సిందే: ఎన్నికల సంఘం ఆదేశాలు

Ram Narayana

ఖమ్మం జిల్లాలో 14 మంది అభ్యర్థుల తిరస్కరణ …

Ram Narayana

నేడు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

Ram Narayana

Leave a Comment