Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు నివాసంలో ముగిసిన మహా చండీయాగం, సుదర్శన హోమం..

చంద్రబాబు నివాసంలో ముగిసిన మహా చండీయాగం, సుదర్శన హోమం..

  • గత మూడ్రోజులుగా చంద్రబాబు నివాసంలో యజ్ఞయాగాదులు
  • నేడు పూర్ణాహుతి
  • ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు, నారా భువనేశ్వరి
Maha Chandi Yagam and Sudarshana Homam in Chandrababu residence completed

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో గత మూడ్రోజులుగా జరుగుతున్న యజ్ఞయాగాదులు నేటితో ముగిశాయి. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ నెల 22 నుంచి మహా చండీయాగం, సుదర్శన హోమం నిర్వహిస్తున్నారు. ఇవాళ నిర్వహించిన పూర్ణాహుతితో ఈ క్రతువు సమాప్తం అయింది. పూర్ణాహుతి కార్యక్రమంలో చంద్రబాబు, నారా భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. 

ఈ యాగం చివరి రోజున చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. గుంటూరు నగరానికి చెందిన ప్రముఖ వేదపండితుడు శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో 40 మంది రుత్విక్కులు మహా చండీయాగం, సుదర్శన హోమం నిర్వహించారు.




Related posts

తెలంగాణలో రెడ్ అలర్ట్.. రెండు మూడు గంటల్లో భారీ వర్షం…

Drukpadam

సీబీఐ ఆదేశాలతో విచారణకు హాజరైన వైఎస్ అవినాశ్ రెడ్డి!

Drukpadam

ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపించాలి: ప్రధాని మోదీ!

Drukpadam

Leave a Comment