Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

విద్యుత్ రంగాన్ని పీకల్లోతు అప్పుల్లోకి నెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం …డిప్యూటీ సీఎం భట్టి

గత ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలతో విద్యుత్ రంగం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క కేసీఆర్ పాలన నిర్వాహకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు . సంపద ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ చేతుల్లో పెడితే అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు …శనివారం ఆయన ఖమ్మం ,భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పర్యటించారు …హైదరాబాదు నుండి హెలికాప్టర్ లో వచ్చిన భట్టి మణుగూరు జూనియర్ కళాశాలకు చేరుకొని బిటిపిఎస్ విద్యుత్ ప్లాంటును సందర్శించి పరిశీలించారు ..

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిబద్దతో ప్రణాళికా బద్ధంగా ముందు చూపుతో అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు…
అనంతరం విద్యుత్ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులు పరిశీలిస్తూ వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియచేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే గత ప్రభుత్వం చేసిన అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా శ్వేతపత్రం విడుదల చేసినట్లు చెప్పారు.
మనిషి మనుగడకు విద్యుత్తో విడదీయరాని సంబంధం ఏర్పడిందని, లోతుగా అధ్యయనం చేస్తూ సమస్యలను అధిగమించి సమాజానికి మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్రాంత ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగ, పౌర సమాజ లక్ష్యాలను సాధించడానికి నిరంతరం అంకితభావంతో పనిచేస్తున్నామని చెప్పారు. పర్యావరణ సమస్య రాకుండా సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాల్సిఉండగా సబ్ క్రిటికల్ సాంకేతికతను వినియోగించడం వల్ల రా మెటీరియల్ ధరలు పెరగడంతో పాటు పర్యావరణ సమస్యలతో భారం పడినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హాయాంలో జరిగిన అంకెలు, సంఖ్యల సమాచారం చాలా ఆందోళన కరంగా ఉన్నట్లు చెప్పారు. మిగులు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని, లెక్కలు చూస్తుంటే చాలా ఆందోళనకరంగా, ఆశ్చర్యంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగే నాటికి 7259 కోట్లు రూపాయలు మాత్రమే బకాయిలున్నాయని చెప్పారు. కేవలం తొమ్మిదిన్నర సంవతమురాల్లో విద్యుత్ రంగం 81,516 కోట్లు రూపాయలు అప్పులు చేశారని చెప్పారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నామని అప్పులు తెచ్చారని చెప్పారు. ప్రభుత్వం ద్వారా పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు 28,842 కోట్లు వెరసి మొత్తం 1,10,358 కోట్లు అప్పులున్నట్లు చెప్పారు. 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ ఇచ్చామని చెప్పిన లెక్కలు చూస్తుంటే భవిష్యత్ తరాలను తాకట్టు పెట్టారని చెప్పారు. విద్యుత్ కొనుగోలు కోసం 30,406 కోట్లు రూపాయలు వెచ్చించారని, అలాగే సింగరేణికి కట్టాల్సిన విద్యుత్ బకాయిలు 19,431 కోట్లు, జెన్కోకు 9,743 కోట్లు, మొత్తం విద్యుత్ కొనుగోలు బకాయిలు 59,580 ఉన్నట్లు చెప్పారు. పీకల్లోతు అప్పుల్లో ముంచిన రాష్ట్రాన్ని తిరిగి ట్రాక్ మీద పెట్టాలంటే లోతుగా అధ్యయనం చేస్తూ ఉన్న సమస్యలను అదిగమిస్తూ ముందుకు పోతూ సమాజానికి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం, వనరులను ప్రజలు అభివృద్ధికి వినియోగంచడానికి మనందరం కల్సి కట్టుగా ప్రణాళికా బద్దంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అంతకు ముందు విద్యుత్ ప్లాంటు యొక్క నిర్వహణతీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించారు.

ఈ సమావేశంలో విద్యుత్ ప్రిన్సిపల్ సెకట్రరీ సయ్యద్ అలి ముర్తుజా రిజ్వి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి క్రిష్ణభాస్కర్, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. వైరా శాసనసభ్యులు డాక్టర్ రాందాస్ నాయక్, మాజీ శాసనసభ్యులు పోదెం వీరయ్య, సిఈలు పప్పుల రత్నాకర్, బిచ్చయ్య, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

Ram Narayana

టీఎస్ ఎప్‌సెట్-2024 ఫ‌లితాల విడుద‌ల‌…

Ram Narayana

 హైదరాబాద్ లో 6.5 కోట్ల నగదు పట్టివేత…అవి ఖమ్మం జిల్లాకు చెందిన నాయకుడివేనా …? 

Ram Narayana

Leave a Comment