ఆంధ్రప్రదేశ్

రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం… సతీసమేతంగా హాజరైన సీఎం జగన్

  • నేడు రిపబ్లిక్ డే
  • లాంఛనంగా ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించిన గవర్నర్
  • హాజరైన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు విజయవాడ రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆతిథ్యమిచ్చిన ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. అక్కడ అల్పాహార విందు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను వైసీపీ తన సోషల్ మీడియా అకౌంట్లో పంచుకుంది.

Related posts

పవన్ కల్యాణ్ కు కరోనా పాజిటివ్

Drukpadam

బరువు తగ్గిపోయి, షుగర్ పెరిగిపోతుంటే.. పాంక్రియాటిక్ కేన్సర్ కావచ్చు!

Drukpadam

జగన్ పర్యటనలో రాళ్ల దాడి … వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లికి నోటీసులు, మరో 15 మంది అరెస్ట్

Ram Narayana