Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

కర్ణాటకలో హైదరాబాద్ బిల్డర్ దారుణ హత్య.. వెంట వెళ్లిన వారే హంతకులా?

  • వ్యాపారం నిమిత్తం 24న బీదర్ వెళ్లిన బిల్డర్ కుప్పాల మధు
  • వెళ్తూ తనతోపాటు చింతల్‌కు చెందిన ముగ్గురిని వెంట తీసుకెళ్లిన మధు
  • హత్య తర్వాత కనిపించకుండా పోయిన ఆ ముగ్గురు
  • మధు వద్ద రూ. 6 లక్షల విలువైన నగలు.. పెద్దమొత్తంలో నగదు

హైదరాబాద్ బిల్డర్ ఒకరు కర్ణాటకలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన కుప్పాల మధు (48) బిల్డర్. ట్రావెల్స్ వ్యాపారం కూడా నిర్వర్తిస్తున్నారు. వ్యాపారం కోసం తరచూ బీదర్ వెళ్లేవారు. ఎప్పట్లానే ఈ నెల 24న కుటుంబ సభ్యులకు చెప్పి బీదర్  బయలుదేరాడు. ఈ క్రమంలో డ్రైవింగ్ కోసం చింతల్‌కు చెందిన రేణుక ప్రసాద్ (32), వరుణ్, లిఖిత్ సిద్దార్థరెడ్డిని వెంట తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి పది గంటల సమయంలో మధుకు భార్య వెంకటలక్ష్మి ఫోన్ చేయగా హైదరాబాద్‌ వస్తున్నట్టు చెప్పారు. గంట తర్వాత మళ్లీ ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ఛాప్ అయింది. తెల్లవారినా మధు ఇంటికి చేరలేదు.

మరోవైపు, తర్వాతి రోజున బీదర్ జిల్లాలోని (25న) మన్నేకెళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారు.. పక్కనే మృతదేహం లభ్యమైంది. కారు నంబర్ ఆధారంగా చనిపోయింది మధు అని పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

మధును దుండగులు కత్తులతో పొడిచి, బండరాయితో తలపై మోది హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. మధు ఒంటిపై రూ. 6 లక్షల విలువైన బంగారు నగలు, పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నాయని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వాటి కోసమే నిందితులు ఆయనను హత్య చేసినట్టు భావిస్తున్నారు. మధుతో పాటు బీదర్ వెళ్లిన రేణుక ప్రసాద్, వరుణ్, లిఖిత్ సిద్దార్థ ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

మహిళను చంపి వెళ్లి.. వెనక్కి వచ్చి మరో ఇద్దర్ని చంపాడు.. అమెరికాలో ఉన్మాది ఘాతుకం!

Drukpadam

రేవ్ పార్టీ కీలక సూత్రధారి లంకపల్లి వాసు …

Ram Narayana

యూపీ లో నిందితుల ఇళ్లను బుల్డోజర్ తో కూల్చిన పోలీసులు …

Drukpadam

Leave a Comment