Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

రాజస్థాన్‌లో మూడేళ్ల చిన్నారిని అపహరించి యువకుడి అత్యాచారం..!

  • తల్లిదండ్రుల చెంత నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లిన యువకుడు
  • ఆపై అత్యాచారం చేసి ముళ్లపొదల్లో పడేసిన వైనం
  • ఓ మహిళ గుర్తించడంతో వెలుగులోకి ఘటన
  • చిన్నారిపై అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ
  • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు

కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. రాజకీయంగానూ ఇది తీవ్ర దుమారం రేపుతోంది. నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలన్న డిమాండ్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదని, నిందితులు ఎలాంటి భీతి లేకుండా నిర్భయంగా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని మరో ఘటన రుజువు చేసింది.

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ యువకుడు మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు చిన్నారిని ఎత్తుకెళ్తున్న వీడియోను గుర్తించిన పోలీసులు దాని ఆధారంగా అతడి కోసం గాలిస్తున్నారు. ఆలయం బయట తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న బాలికను నిందితుడు ఎత్తుకెళ్లాడు. ఉదయం 6.30 గంటల సమయంలో పొదల్లో ఉన్న బాలికను అటుగా వెళ్లిన ఓ మహిళ గుర్తించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. చిన్నారి పెదవులపై గాట్లు ఉండడం, శరీరంపై గాయాలు ఉండడంతో వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను ఆసుపత్రికి తరలించారు. చిన్నారి అత్యాచారానికి గురైనట్టు పరీక్షల్లో తేలింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో నిందితుడు బాలికను ఎత్తుకెళ్తుండడం సీసీటీవీలో రికార్డయిందని పోలీసులు తెలిపారు. దాని ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. బాధిత బాలిక తల్లిదండ్రులు మధ్యప్రదేశ్‌కు చెందినవారని, వలస వచ్చి జోధ్‌పూర్‌లోని ఓ మురికివాడలో ఉంటున్నట్టు  తెలిపారు. తండ్రి చెత్త ఏరుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడని, బాలిక తల్లి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్టు వివరించారు. వారికి ఐదేళ్ల కుమారుడు కూడా ఉన్నట్టు చెప్పారు.

Related posts

ఖమ్మం రూరల్ లో పోలీస్ వర్సెస్ సిపిఐ…

Drukpadam

సైబర్ క్రైమ్ 3 నిమిషాల వ్యవధిలో కోటి 10 లక్షలు డ్రా …అప్రమత్తమైన కస్టమర్

Ram Narayana

వరంగల్‌లో డ్రగ్స్ కలకలం.. డ్రగ్స్ విక్రయిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థి సహా ఆరుగురి అరెస్ట్!

Drukpadam

Leave a Comment