Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఈడీ కేసు నమోదు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఈడీ కేసు నమోదు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేసు నమోదైంది. ముడా వివాదంలో కేసు నమోదు చేసినట్లు సోమవారం ఈడీ అధికారులు ప్రకటించారు. ఇటీవల రాష్ట్రలోకాయుక్త ఎఫ్‌ఐఆర్‌ను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర దర్యాప్తు సంస్థ.. మనీలాండరింగ్ కేసులో ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు. కాగా ఇప్పటికే ముడా స్థలం కేటాయింపు కేసులో సిద్ధరామయ్య, ఆయన భార్య, మరో ఇద్దరిపై మైసూరు లోకాయుక్త పోలీసులు శుక్రవారమే కేసు నమోదు చేశారు . సీఎం సిద్ధరామయ్యను ఏ1గా, ఆయన భార్య పార్వతిని ఏ2గా చేర్చారు. అంతేకాదు.. సీఎంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు జరిపేందుకు ఇప్పటికే గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ సైతం అనుమతిని ఇవ్వడం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది.దీనిపై కాంగ్రెస్ మండిపడుతుంది …ఇది కాషాయ పార్టీ నాటకంలో భాగమని కొట్టి పారేస్తోంది …తాము న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నది ..

Related posts

టికెట్ లేకుండా రైలు ప్రయాణం.. ప్రశ్నిస్తే కేంద్రమంత్రి తెలుసంటూ సమాధానం..

Ram Narayana

ఆసుప‌త్రి నుంచి సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్‌!

Ram Narayana

‘వన్ నేషన్ – వన్ ఎలెక్షన్’కు కేంద్ర కేబినెట్ ఆమోదం…

Ram Narayana

Leave a Comment