ఆంధ్రప్రదేశ్

నర్సింగ్ కళాశాల విద్యార్ధులకు తప్పిన పెనుప్రమాదం .. బస్సు దగ్ధం

  • రేపల్లె ఐఆర్ఈఎఫ్ విద్యా సంస్థకు చెందిన బస్సు దగ్ధం
  • నర్సింగ్ విద్యార్థినులు గుంటూరు వెళ్తుండగా ఘటన
  • పొగను గమనించి ముందుగానే బస్సు నుంచి దిగిపోయిన నర్సింగ్ విద్యార్థినులు

నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు పెను ప్రమాదం తప్పింది. నర్సింగ్ విద్యార్ధినులు పరీక్షలు రాసేందుకు కళాశాలకు వెళుతుండగా వారి బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటన బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగింది. 

రేపల్లె ఐఆర్ఈఎఫ్ విద్యా సంస్థకు చెందిన బస్సులో విద్యార్థినులు పరీక్షలు రాసేందుకు గుంటూరుకు వెళుతుండగా, విద్యుదాఘాతంతో బస్సు నుంచి మంటలు చెలరేగాయి. ముందుగానే పొగను గుర్తించి విద్యార్థినులు బస్సు నుంచి దిగిపోయారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. 

విద్యార్థినులు దిగిపోయిన కొద్దిసేపటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. స్థానికులు స్పందించి నీళ్లు చల్లినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. రేపల్లె అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు.   

Related posts

జగన్ అక్రమాస్తుల కేసు: విచారణ నుండి తప్పుకున్న సుప్రీం న్యాయమూర్తి!

Ram Narayana

ఢిల్లీ బ‌య‌లుదేరిన‌ తెలంగాణ మంత్రుల బృందం

Drukpadam

సత్యసాయి సేవలు చిరస్మరణీయం: రాష్ట్రపతి ముర్ము, సీఎం చంద్రబాబు…

Ram Narayana