ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలు

తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ..!

  • కోరుకొండలో పోలీసుల తనిఖీలు
  • ఐదుగురు మహిళలు, 14 మంది పురుషుల అరెస్ట్
  • గుంటూరు ప్రాంతానికి చెందినవారుగా గుర్తింపు

నూతన సంవత్సరం సందర్భంగా రేవ్ పార్టీ ఏర్పాటు చేశారనే వార్త తూర్పు గోదావరి జిల్లాలో కలకలం రేపింది. దీంతో సోమవారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేపట్టారు. కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ సమీపంలోని ఓ కల్యాణ మంటపంలో పార్టీ చేసుకుంటున్న యువతీయువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న వారు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారని తెలుస్తోంది.

పార్టీని అడ్డుకున్న పోలీసులు.. ఐదుగురు మహిళలు, 14 మంది పురుషులను అరెస్ట్ చేశారు. నిందితులు ఓ ఫెర్టిలైజర్ కంపెనీకి చెందిన వారని అధికారవర్గాల సమాచారం. నూతన సంవత్సరం సందర్భంగా ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ రేవ్ పార్టీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

ఖమ్మం లాడ్జిలో ఎఆర్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ ఆత్మహత్య!

Drukpadam

పోలీసులకు హారతిచ్చి ఆందోళనకు దిగిన షర్మిల.. కేసీఆర్, పోలీసులపై తీవ్ర విమర్శలు!

Ram Narayana

వి.హనుమంతరావు కారును ధ్వంసం చేసిన దుండగులు!

Ram Narayana