తెలంగాణ వార్తలు

పాడి కౌశిక్ రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు!

  • లిఖితపూర్వకంగా స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన సంజయ్
  • ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే అడ్డుకున్నారన్న సంజయ్
  • నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకుంటామన్న స్పీకర్

హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు చేశారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో జరిగిన అధికారిక సమావేశంలో దుర్భాషాలాడారని లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే అడ్డుకున్నారని… ఇందుకుగాను అతనిపై చర్యలు తీసుకోవాలని సంజయ్ కోరారు.

స్పందించిన స్పీకర్ ప్రసాద్ కుమార్… నివేదిక తెప్పించాక చర్యలు తీసుకుంటామన్నారు. 

కరీంనగర్ కలెక్టరేట్‌లో అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం రసాభాసగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ని ఉద్దేశించి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో వాగ్వాదం జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే ఈ ఘటన జరిగింది.

Related posts

మహాత్మా గాంధీ అతి పెద్ద విగ్రహం హైద్రాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం ..గున్న రాజేందర్ రెడ్డి హర్షం ..

Ram Narayana

రాజలింగమూర్తి హత్యలో భిన్న కోణాలు …ఎస్పీ పర్వేక్షణలో దర్యాప్తు ..

Ram Narayana

నా వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవద్దు : వివాదాస్పద వ్యాఖ్యలపై కొండా మురళి

Ram Narayana