ఖమ్మం వార్తలు

ఖమ్మం జిల్లాలో క్రికెట్ ఆడుతూ మైదానంలో కుప్పకూలిన యువకుడు!

  • కూసుమంచి జిల్లాలో ఘటన 
  • మైదానంలో కుప్పకూలిన విజయ్ అనే యువకుడు
  • గుండెపోటుతో మృతి చెందినట్లు ప్రకటించిన వైద్యులు

ఖమ్మం జిల్లాలో ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. దీంతో అతనిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అతడు గుండెపోటుతో మరణించినట్లుగా వైద్యులు ప్రకటించారు. జిల్లాలోని కూసుమంచి మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది.

ఈ టోర్నమెంట్‌లో విజయ్ అనే యువకుడు ఒక్కసారిగా మైదానంలో పడిపోయాడు. దీంతో నిర్వాహకులు అతనిని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు తెలిపారు. దీంతో టోర్నమెంట్ ప్రాంగణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Related posts

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా నూతి సత్యనారాయణ… పాల్గొన్న ముగ్గురు మంత్రులు ..

Ram Narayana

కొత్తగూడెం మేయర్ గా సిపిఐ…మిగతా మున్సిపాల్టీల్లో చైర్ పర్సన్ లుగా కాంగ్రెస్ అభ్యర్థులు

Ram Narayana

చరిత్రలో నిలిచిపోయేలా ఖమ్మలో 100 సంవత్సరాల సిపిఐ బహిరంగ సభ …భాగం

Ram Narayana