స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు…అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి బీఆర్ఎస్, బీజేపీ కూడా సిద్దమా ? అని సవాల్ విసిరారు. కులగణన సర్వేపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. 2011 నుంచి తెలంగాణలో అధికారిక జనాభా లెక్కలు లేవన్నారు. బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ అపోహల సంఘం అధ్యక్షుల లెక్కలు చెబుతున్నారని విమర్శించారు. అపోహల సంఘం లెక్కలు కూడా తప్పుగానే ఉన్నాయన్నారు. పాయల్ శంకర్ సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ ను బట్టి అసెంబ్లీలో మాట్లాడుతున్నారని చెప్పారు రేవంత్.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, పద్మారావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, డీకే అరుణ లాంటి వాళ్లు కులగణన సర్వేలో పాల్గొనలేదన్నారు రేవంత్. భూమి వివరాల కాలం ఉంది కాబట్టే సర్వేలో పాల్గొనలేదన్నారు. ఇల్లిల్లు తిరిగి సేకరించిన డేటాను తప్పు అంటే ఎలా? అని ప్రశ్నించారు రేవంత్. ప్రతిపక్షాలు ఓ డాక్యుమెంట్స్ ను సర్క్యులేట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు రేవంత్. సర్క్యులేట్ అవుతున్న డాక్యుమెంట్ లోనూ తప్పుడు లెక్కలే ఉన్నాయన్నారు. వాస్తవాలను సభ ముందు ఉంచితే విమర్శిస్తున్నారని తెలిపారు. ఈ డాక్యుమెంట్ అఫిషియలా కాదా ఆనాటి మంత్రులు చెప్పాలని ప్రశ్నించారు. కులగణన ప్రకారం తెలంగాణ జనాభా మూడుకోట్ల 70 లక్షలకు పైగా ఉందన్నారు. మా కులగణన నివేదిక వందకు వంద శాతం పారదర్శకమన్నారు రేవంత్. మోదీ ప్రదాని అయిన తర్వాత జనగణన చేయలేదన్నారు రేవంత్. జనాభా లెక్కలు చేయడం మోదీకి ఇష్టం లేదన్నారు. 2021లో చేయాల్సిన జనాభా లెక్కలు 2025 వచ్చినా మొదలు పెట్టలేదన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. 3.కోట్ల 54 లక్షలుగా ఉంటే.. కులగణన లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3కోట్ల 70 లక్షలకు పైగా ఉందన్నారు రేవంత్.
తెలంగాణలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చూసి సంతోషించాం కానీ సర్వే చూసి బాధపడ్డామన్నారు. ప్రభుత్వ వెబ్ సైట్లలో తెలంగాణ జనాభా 4 కోట్లుగా ఉంటే 38 లక్షల మందిని తక్కువ చేసి చూపించారని విమర్శించారు. ఈ తతంగమంతా బీసీలను మోసం చేసేందుకే అని చెప్పారు. కులగణనచేసి చేతులు దులుపుకుంటామంటే ఎలా? హిందూ బీసీలు,ముస్లీం బీసీలు ఉంటారా అని ప్రశ్నించారు పాయల్ శంకర్. మాటిచ్చాం..తొందపడ్తాం అంటే ఎలా అని అన్నారు. ఈ కులగణనతో బీసీలకు న్యాయం జరుగుతుందా? అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు నెలలు లేటైనా పర్వాలేదు కానీ.. కులగణన పగడ్భందీగా చేయాలని చెప్పారు. జనాభాలో 60 శాతం జనాభా ఉన్న బీసీలకు రాజకీయ న్యాయం ఎక్కడా అని ప్రశ్నించారు. వెనుబడిన వర్గాలకు గెలవలేని సీట్లు ఇస్తారు. అన్ని రాజకీయ పార్టీలు ఓడిపోయే సీట్లే బీసీలకు ఇస్తాయి. రాహుల్ గాంధీ మాటలకు తెలంగాణ ప్రభుత్వ తీరుకు పొంతన లేదు. బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ పోరాటంలో ముందుంది బీసీ బిడ్డలే. బడ్జెట్లో బీసీలకు 3 వేల కోట్లు కేటాయించి 15 కోట్లు ఖర్చు చేశారు. ఒక బీసీని ప్రధానిని చేసిన చరిత్ర బీజేపీది. కులవృత్తులను ఆదుకుంటామని అన్నోళ్లంతా దొంగలే. కులవృత్తులను నమ్ముకున్నాం కాబట్టే ఇంకా ఎదగలేకపోయాం.