- కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీఆర్ఎస్లో చేరబోతున్నట్లు నిన్న ప్రచారం
- బీఆర్ఎస్లో చేరబోతున్నట్లు జరిగిన ప్రచారాన్ని ఖండించిన కోనేరు కోనప్ప
- చివరి వరకూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టీకరణ
నిన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు …తాను రాజకీయాలు దూరంగా ఉంటానని ప్రకటించారు …పైగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థిని కాదని స్వతంత్ర అభ్యర్థిని బలపరుస్తున్నట్లు ప్రకటించారు …దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో రాజకీయ ప్రకంపనలు రేగాయి…వెంటనే రంగంలోకి దిగిన రేవంత్ టీం కోనేరు కోనప్పను సీఎంఓ కు పిలిపించారు …ఆయన చర్చలు జరిపి ఆయన ఆగ్రహానికి కారణమైన విషయాలను చర్చించారు …ఆయన్ను సముదాయించారు …దీంతో తాను నిన్న చేసిన రాజీనామా ప్రకటనను వెనక్కు తీసుకున్నారు …ఇక జీవితాంతం కాంగ్రెస్ లోనే ఉంటానని ప్రకరించారు …
సిర్ఫూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. అనంతరం ఆయన పార్టీ మార్పుపై వివరణ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీఆర్ఎస్లో చేరబోతున్నట్లు జరిగిన ప్రచారాన్ని ఖండించారు. తాను చివరి వరకూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని అన్నారు.
కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీఆర్ఎస్లో చేరనున్నట్లు నిన్న జోరుగా ప్రచారం సాగింది. అయితే, ఈరోజు ఆయన ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కోనేరు కోనప్ప 2014 ఎన్నికల్లో బీఎస్పీ నుండి పోటీ చేసి నాటి బీఆర్ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్యపై విజయం సాధించారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో మరోసారి బీఆర్ఎస్ నుండి పోటీ చేసి గెలిచారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్ చేతిలో ఓడిపోయారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరడంతో కోనేరు కోనప్ప అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీలో చేరారు.