ప్రమాదాలు ...

యాదగిరిగుట్టకు వెళుతుండగా కారులో మంటలు… తప్పిన ప్రాణాపాయం!

  • గజ్వేల్ నుంచి భువనగిరికి వెళ్లే దారిలో కారులో మంటలు
  • కారులో నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్
  • కారులో నుంచి ప్రయాణికులు దిగడంతో తప్పిన ముప్పు

యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం యాదగిరిగుట్టకు వెళుతుండగా కారులో మంటలు చెలరేగి, తృటిలో ప్రాణాపాయం తప్పిన ఘటన తెలంగాణలో జరిగింది. గజ్వేల్ నుండి భువనగిరికి వెళ్లే దారిలో ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగాయి. తుర్కపల్లి సమీపంలోకి రాగానే కారు ముందు భాగం నుండి పొగలు వచ్చాయి. ఇది గమనించిన డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చేశాడు.

వెంటనే అందరూ కారులో నుంచి కిందకు దిగడంతో ముప్పు తప్పింది. కారు మంటల్లో చిక్కుకుంది. ప్రమాదంపై పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. పైరింజన్‌తో ప్రమాదస్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాదం సమయంలో అటుగా వెళుతున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు.

Related posts

ప్రాణాలు తీసిన ఈత సరదా… తండ్రి ఎదుటే ముగ్గురు విద్యార్థులు మృతి

Ram Narayana

కటక్ ఆసుపత్రి ఐసీయూలో మంటలు.. 10 మంది సజీవ దహనం

Ram Narayana

వడోదర బ్రిడ్జి కూలిన ఘటనలో 9 మంది జలసమాధి

Ram Narayana