ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్టీ కార్యకర్తను తెలుగు దేశం నేతలు, పార్టీ నుండి సస్పెండ్ చేశారు. వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల గౌరవానికి భంగ కలిగేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదని హెచ్చరించింది. అంతే కాకుండా, చేబ్రోలు కిరణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా అధిష్ఠానం పార్టీ నేతలను ఆదేశించడంతో పార్టీ నేతలు చేబ్రోలు కిరణ్ పై గుంటూరు పోలీసులు ఫిర్యాదు చేశారు.
previous post
next post