విశాఖపట్నం మేయర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వల్ల ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిపై జరిగిన రాజకీయ పరిణామాలపై ఆయన స్పందించారు. ప్రజలిచ్చిన తీర్పును తారు మారు చేస్తూ టీడీపీ రాజకీయం చేసిందన్నారు. అవిశ్వాసం తీర్మానం ద్వారా ప్రజలు ఎన్నుకున్న బీసీ మహిళను మేయర్ పదవి నుండి బలవంతంగా గద్దె దించడమే చంద్రబాబు దుర్మార్గానికి ప్రత్యక్ష సాక్ష్యమని జగన్ విమర్శించారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే లక్ష్యంతో యాదవ వర్గానికి చెందిన మహిళను మేయర్గా నియమించినట్లు తెలిపారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు అధికార్ల మద్దతుతో, కోట్లాది రూపాయల ప్రలోభాలతో, పోలీసుల సహాయంతో బెదిరింపులకు దిగారని
previous post
next post