Rahul Gandhi - Modi
జాతీయ వార్తలు

మోడీకి రాహుల్ లేఖ

  • పార్లమెంట్ ప్రత్యేక సమావేశం వెంటనే ఏర్పాటు చేయాలి
  • దాడి బాధితులకు నివాళి, భవిష్యత్ చర్యలపై చర్చకు పిలుపు
  • ఉగ్రవాదంపై దేశం ఐక్యత చాటాలని లేఖలో విజ్ఞప్తి

కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. లోక్‌ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంయుక్తంగా ఈ లేఖను పంపారు. పహల్గామ్ దాడి పరిణామాలపై చర్చించేందుకు వీలైనంత త్వరగా పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వారు తమ లేఖలో ప్రధానిని కోరారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం యావత్తూ ఐక్యంగా నిలుస్తుందనే బలమైన సందేశాన్ని ప్రపంచానికి అందించాల్సిన అవసరం ఉందని రాహుల్, ఖర్గే తమ లేఖలో నొక్కి చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి సభ నివాళులర్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన కట్టు దిట్టమైన భద్రతా చర్యలపై పార్లమెంట్ వేదికగా సమగ్రంగా చర్చించాలని వారు విజ్ఞప్తి చేశారు.

Related posts

ప్రజ్వల్ ఫ్లైట్ దిగగానే అరెస్ట్ ఖాయం …

Ram Narayana

ఐపీఎస్ పూరన్ కుమార్ మృతిపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు…

Ram Narayana

అమెరికాకు శశి థరూర్.. సౌదీకి ఒవైసీ.. ఎంపీల బృందాలు వెళ్లే దేశాలివే..!

Ram Narayana