పాక్ హద్దులు మీరితే ఉపేక్షించం …త్రివిధ దళాలు హెచ్చరిక
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది …
మనం ఉగ్రవాద శిభిరాలనే లక్ష్యంగా దాడులు చేశాం …
పాక్ మన ఎయిర్ బేస్ లు ,ఆర్మీ ని టార్గెట్ చేసింది
మనం వారిని దీటుగా ఎదుర్కొన్నాం ..
పాక్ హద్దులు మీరితే ఉపేక్షించం ..ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది …పాక్ ఆర్మీ అధికారులు కాల్పులు విరమణ చేయాలనీ భారత్ ను బ్రతిమిలాకుడున్నారు …అయితే వాళ్ళు బుద్దిగా ఉంటె మనం ఉంటాం లేకపోతె తడాకా చూపిస్తామని త్రివిధ దళాల అధికారులు ఘాటైన హెచ్చరికలు చేశారు … ఆదివారం న్యూ ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఎయిర్ మార్షల్ ఏకే భారతి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, మేజర్ జనరల్ ఎస్ఎస్ శర్మ, వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, పాకిస్థాన్ బహుశా ఊహించని విధంగా భారత్ వేగంగా, కచ్చితత్వంతో తిప్పికొట్టిందని తెలిపారు. మీడియా కు వివరించారు …70 నిమిషాలపాటు సాగిన ఈసమావేశంలో మీడియా ప్రతినిధులు అడిగిన అనేక ప్రశ్నలకు ఓపికగా సమాదానాలు ఇచ్చారు …పహాల్గమ్ అనంతరం మన దళాలు ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేసుకుని దాడులు చేశాయని వారు మాత్రం మన ఎయిర్ బేస్ లు ఆర్మీ క్యాంపులు లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు …ఉగ్రవాద శిబిరాలను జయప్రదంగా ధ్వంసం చేయడం జరిగిందని అన్నారు …ఈ సందర్భంగా 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని తెలిపారు …ప్రధానంగా 4 ఉగ్రశిభిరాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు …కాల్పుల విరమణ తర్వాత కూడా పాక్ నుంచి కవ్వింపు చర్యలు జరిగాయని వారు కాల్పులు జరిపారని వాటిని నిశితంగా పరిశీలిస్తున్నామని అన్నారు …వారు ప్రయోగించిన డ్రోన్లను కూల్చి వేశామని తెలిపారు …
ఇది ఇలా ఉండగా ప్రధాని మోడీ త్రివిధ దళాల అధికారులతో జరిపిన సమావేశంలో పాక్ కాల్పుల విరమణను ఉల్లఘింస్తే మనం మిస్సైళ్ళను ప్రయోగించాలని అన్నారు …పాక్ విషయంలో భారత సైన్యానికి పూర్తీ అధికారాలు ఇచ్చామని చెప్పారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనదేనని ఇందులో మరోమాటకు తావులేదని స్పష్టం చేశారు …పాక్ , భారత్ మధ్య సమస్యలు పరిష్కరానికి ఎవరి మధ్యవర్తిత్వం అవసరంలేదని తేల్చి చెప్పారు …
మన పైలెట్లు అందరూ సేఫ్ గా తిరిగొచ్చారు: ఎయిర్ మార్షల్ ఏకే భారతి

- ఆపరేషన్ సింధూర్ విజయవంతం… ఎయిర్ మార్షల్ ఏకే భారతి
- అన్ని లక్ష్యాలను ఛేదించామని వెల్లడి
- పాక్ విమానాలను సరిహద్దులకు ఆవలే కూల్చివేశామని స్పష్టీకరణ
పాకిస్థాన్పై భారత వాయుసేన చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ విజయవంతంగా ఛేదించిందని, ఈ ఆపరేషన్లో పాల్గొన్న పైలట్లందరూ సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చారని ఎయిర్ మార్షల్ ఏకే భారతి ఆదివారం స్పష్టం చేశారు. పాకిస్థాన్ దుందుడుకు చర్యలకు ప్రతిస్పందనగా ఈ కచ్చితమైన దాడులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
“మేము ప్రస్తుతం ఒక యుద్ధ వాతావరణంలో ఉన్నాం, పోరాటంలో నష్టాలు సహజం. అయినప్పటికీ, మేము మా లక్ష్యాలన్నింటినీ సాధించాం, మా పైలట్లందరూ క్షేమంగా తిరిగి వచ్చారు” అని భారతి ఒక మీడియా సమావేశంలో వివరించారు. కొన్ని పాకిస్థానీ విమానాలను కూల్చివేశామని, అయితే సాంకేతిక అంచనాలు కొనసాగుతున్నందున వాటి సంఖ్యను ఇప్పుడే వెల్లడించలేమని ఆయన పేర్కొన్నారు. “పాకిస్థానీ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించకుండా నిరోధించాం, కాబట్టి మా వద్ద వాటి శకలాలు లేవు, కానీ దాడులు జరిగినట్లు మాకు కచ్చితంగా తెలుసు” అని ఆయన తెలిపారు.
పాకిస్థాన్ వైమానిక స్థావరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు మరియు సైనిక మౌలిక సదుపాయాలపై వేగవంతమైన, సమన్వయంతో కూడిన, ప్రణాళికాబద్ధమైన దాడులు చేసిందని భారతి పేర్కొన్నారు. “ఎక్కడ దెబ్బకొడితే తీవ్ర నష్టం వాటిల్లుతుందో అక్కడే దాడి చేయాలని నిర్ణయించాం. చక్లాలా, రఫీక్, రహీమ్ యార్ ఖాన్ వైమానిక స్థావరాలపై, ఆ తర్వాత సర్జోదా, భులారి, జాకోబాబాద్లపై దాడులు చేశాం. ఈ స్థావరాలు, అంతకు మించిన వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం మాకుంది” అని ఆయన స్పష్టం చేశారు, పౌర నష్టాన్ని నివారించడానికి ఈ ప్రతిస్పందన కచ్చితంగా సైనికపరమైనదని నొక్కి చెప్పారు.
పాకిస్థాన్ తన డ్రోన్ ఆపరేషన్ల సమయంలో లాహోర్ నుంచి పౌర, అంతర్జాతీయ విమానాలు టేకాఫ్ అవ్వడానికి అనుమతించడం నిర్లక్ష్యపూరితమైన చర్య అని, దీనివల్ల భారత్ అత్యంత జాగ్రత్తగా దాడులు చేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ప్రాణనష్టం కలిగించడం తమ లక్ష్యం కాదని, స్పష్టమైన సందేశం పంపడమే తమ ఉద్దేశమని ఏకే భారతి అన్నారు. “మా పని లక్ష్యాన్ని ఛేదించడమే తప్ప, మృతదేహాలను లెక్కించడం కాదు” అని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన కొద్ది గంటల్లోనే పాకిస్థాన్ దానిని ఉల్లంఘించిందని, దీంతో భారత్ హాట్లైన్ ద్వారా తాజా హెచ్చరిక జారీ చేసి, తమ బలగాలను అత్యంత అప్రమత్తంగా ఉంచిందని భారతి తెలిపారు. పాక్ ఇంకేమాత్రం రెచ్చగొట్టినా పూర్తిస్థాయిలో ప్రతిస్పందిస్తాం” అని భారతి పునరుద్ఘాటించారు.
పాక్ ఆర్మీ 40 మంది సైనికులను కోల్పోయి ఉంటుంది: భారత సైన్యం

- ఎల్ఓసీలో భారత కాల్పులు… 35-40 మంది పాక్ సైనికులు మృతి
- ఐదుగురు భారత జవాన్ల వీరమరణం… అధికారుల నివాళి
- వారి త్యాగాలను దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని వెల్లడి
నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి మే 7 నుంచి మే 10 మధ్య జరిగిన ఫిరంగి దాడులు, చిన్న ఆయుధాలతో కాల్పుల్లో పాకిస్థాన్ సైన్యానికి చెందిన సుమారు 35 నుంచి 40 మంది సైనికులు మరణించినట్లు భారత సైనిక వర్గాలు ఆదివారం ఒక మీడియా సమావేశంలో వెల్లడించాయి. ఇదే సమయంలో, ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట చేపట్టిన ప్రత్యేక కార్యకలాపంలో వందమందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు భారత సైన్యం ప్రకటించింది.
ఈ కార్యకలాపాల సమయంలో పాకిస్థాన్కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భారత సైన్యానికి చెందిన ఐదుగురు సైనికులు వీరమరణం పొందారని అధికారులు తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో, వారి త్యాగాలను ఈ దేశం కృతజ్ఞతతో ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది మరియు గొప్పగా కీర్తిస్తుందని పేర్కొన్నారు.