భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావు పేటలో చిరుత పులి సంచరిస్తుందన్న వార్త స్థానికంగా కలకలం రేపింది. బుధవారం ఉదయం జూపల్లి వెంకట రామారావు అనే రైతు, పేట మాలపల్లి సమీపంలోని తన కొబ్బరి తోటకు వెళ్ళగా చిరుత పులి కనిపించినట్లు చెబుతున్నాడు. రామారావు వెంటనే వచ్చి విషయాన్ని స్థానికులకు తెలపడంతో అందరూ భయాందోళనకు గురవుతున్నారు. సమాచారమందుకున్న అటవీ శాఖ అధికార్లు ఘటనా స్థలానికి చేరుకొని కొబ్బరి తోటలో పులి పాద ముద్రలను గుర్తిస్తున్నారు.
previous post